ETV Bharat / sports

బ్యాడ్మింటన్​లో భారత్​కు నిరాశ- 12ఏళ్లలో ఇదే తొలిసారి! - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 4:53 PM IST

India Badminton Olympics: పారిస్ ఒలింపిక్స్​లో భారత షట్లర్లు నిరాశ పర్చారు. ఈ విశ్వ క్రీడల్లో బ్యాడ్మింటన్ ఈవెంట్​లో భారత్​కు ఒక్క పతకమూ దక్కలేదు. కాంస్య పతక రేసులో పోరాడిన లక్ష్యసేన్​కు సైతం ఓటమి తప్పలేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు ఒట్టి చేతులతో వెనుదిరిగారు.

India Badminton Olympics
India Badminton Olympics (Source: Associated Press)

India Badminton Olympics: పారిస్ ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్​కు నిరాశే మిగిలింది. ఈ ఏడాది మన షట్లర్లు గట్టిగా పోరాడినప్పటికీ ఎవరూ పతకాన్ని సాధించలేకపోయారు. రీసెంట్​గా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం పోరులో జెడ్‌ జే లీ (మలేసియా)పై 21-13, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్​లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

12 ఏళ్లలో తొలిసారి
కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ఓటమితో పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 2008 తర్వాత ఒలింపిక్స్‌ లో భారత్ బ్యాడ్మింటన్ పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం గెలుచుకుంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్​లో ఏకంగా రజతం దక్కించుకొని సత్తాచాటింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్​లోనూ బ్యాడ్మింటన్​ ఈవెంట్​లో సింధు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో వరుసగా మూడు ఒలింపిక్స్ ల్లోనూ భారత్ బ్యాడ్మింటన్ ఈవెంట్​ల్లో ఏదో ఒక పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం భారత్​కు నిరాశ తప్పలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు సింగిల్స్​లో నిరాశ పర్చింది. హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందనుకున్న సింధు ప్రీ క్వార్టర్స్​లో వెనుదిరింది. కాగా, 22ఏళ్ల లక్ష్యసేన్ సంచలన ప్రదర్శనతో పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ దూసుకొచ్చి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా నిలిచాడు. పతకం సాధిస్తే మరో రికార్డు సాధించేవాడు. కానీ దానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ను పోరాడి ఓడిపోయాడు.

ఖాతాలో మూడు పతకాలు
ఇక పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్‌ ఇప్పటివరకు 3 పతకాలే గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో యువ షూటర్ మను భాకర్‌ కాంస్యం పతకం సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్‌. ఆ తర్వాత 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్ ఈవెంట్‌లో సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి మను భాకర్ రెండో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సైతం షూటింగ్‌లోనే దక్కడం గమనార్హం. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ లో షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్యాన్ని ముద్దాడాడు.

చరిత్ర సృష్టించిన భారత మహిళలు- టేబుల్​ టెన్నిస్​లో క్వార్టర్స్​లోకి ఎంట్రీ - Paris 2024 Olympics

కాంస్యం పోరులో లక్ష్యసేన్, బరిలో ఆకుల శ్రీజ- మేజర్ ఈవెంట్స్ ఇవే! - Paris Olympics 2024

India Badminton Olympics: పారిస్ ఒలింపిక్స్​లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్​కు నిరాశే మిగిలింది. ఈ ఏడాది మన షట్లర్లు గట్టిగా పోరాడినప్పటికీ ఎవరూ పతకాన్ని సాధించలేకపోయారు. రీసెంట్​గా యంగ్ షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం పోరులో జెడ్‌ జే లీ (మలేసియా)పై 21-13, 16-21, 11-21 తేడాతో ఓడిపోయాడు. దీంతో పారిస్ ఒలింపిక్స్​లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

12 ఏళ్లలో తొలిసారి
కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ఓటమితో పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత షట్లర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. 2008 తర్వాత ఒలింపిక్స్‌ లో భారత్ బ్యాడ్మింటన్ పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం గెలుచుకుంది. మరో స్టార్ షట్లర్ పీవీ సింధు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్​లో ఏకంగా రజతం దక్కించుకొని సత్తాచాటింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్​లోనూ బ్యాడ్మింటన్​ ఈవెంట్​లో సింధు కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో వరుసగా మూడు ఒలింపిక్స్ ల్లోనూ భారత్ బ్యాడ్మింటన్ ఈవెంట్​ల్లో ఏదో ఒక పతకాన్ని ఖాతాలో వేసుకుంది.

అయితే 2024 పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం భారత్​కు నిరాశ తప్పలేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు సింగిల్స్​లో నిరాశ పర్చింది. హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందనుకున్న సింధు ప్రీ క్వార్టర్స్​లో వెనుదిరింది. కాగా, 22ఏళ్ల లక్ష్యసేన్ సంచలన ప్రదర్శనతో పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌ దూసుకొచ్చి ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా నిలిచాడు. పతకం సాధిస్తే మరో రికార్డు సాధించేవాడు. కానీ దానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. కాంస్య పతక పోరులో లక్ష్యసేన్ ను పోరాడి ఓడిపోయాడు.

ఖాతాలో మూడు పతకాలు
ఇక పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్‌ ఇప్పటివరకు 3 పతకాలే గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో యువ షూటర్ మను భాకర్‌ కాంస్యం పతకం సాధించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్‌. ఆ తర్వాత 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్ ఈవెంట్‌లో సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి మను భాకర్ రెండో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సైతం షూటింగ్‌లోనే దక్కడం గమనార్హం. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ లో షూటర్ స్వప్నిల్ కుశాలే కాంస్యాన్ని ముద్దాడాడు.

చరిత్ర సృష్టించిన భారత మహిళలు- టేబుల్​ టెన్నిస్​లో క్వార్టర్స్​లోకి ఎంట్రీ - Paris 2024 Olympics

కాంస్యం పోరులో లక్ష్యసేన్, బరిలో ఆకుల శ్రీజ- మేజర్ ఈవెంట్స్ ఇవే! - Paris Olympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.