ETV Bharat / sports

లార్డ్స్ విజయానికి 22ఏళ్లు- గంగూలీ మాస్ లెవెల్ సెలబ్రేషన్స్ గుర్తున్నాయా? - Ind vs Eng Lords 2022

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 1:25 PM IST

Ind vs Eng Lords Sourav Ganguly Celebration: 2002 జులై 13న నాట్​వెస్ట్​ సిరీస్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​పై భారత్ చరిత్రాత్మకమైన విజయం అందుకుంది. ఈ విజయాన్ని అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ గంగూలీ వీల లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు.

Ind vs Eng Lords 2002
Ind vs Eng Lords 2002 (Source: Getty Images)

Ind vs Eng Lords Sourav Ganguly Celebration: టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ లార్డ్స్​ మాస్ సెలబ్రేషన్స్​కు శనివారం (జులై 13)తో 22ఏళ్లు పూర్తైంది. రెండు దశాబ్దాల కిందట గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా లార్డ్స్ మైదానం వేదికగా ​నాట్​వెస్ట్​ సిరీస్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​పై చారిత్రక విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్​ 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 49.3 ఓవర్లలో 8 కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

అయితే ఈ విక్టరీని బాల్​కనీ​లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ గంగూలీ తన జెర్సీ తీసి మాస్ లెవెల్​లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో ఇది సంచలనంగా మారింది. ఇది టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ విజయంలో అప్పటి జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్ అదరగొట్టారు.

325 లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (62 పరుగులు) తొలి వికెట్​కు 106 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఇక సచిన్ తెందూల్కర్ (14), ద్రవిడ్ (5) విఫలమయ్యారు. దీంతో మిడిలార్డర్​లో యువరాజ్ సింగ్ (69 పరుగులు), మహ్మద్ కైఫ్ (87*) సూపర్ ఇన్నింగ్స్​తో టీమ్ఇండియాకు సూపర్ విక్టరీ అందించారు.

ఆ విజయమూ చరిత్రకత్మకమే: 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్, గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్​కు ఓటమి రుచి చూపించింది. అయితే గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువేమీ కాదన క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడి ఫ్లాట్ పిచ్​లపై పేసర్లు సంధించే బౌన్సర్లను ఎదుర్కొవడం కూడా బ్యాటర్లకు సవాలే. అప్పటివరకు ఆసీస్ గబ్బా గ్రౌండ్​లో 1988లో వెస్టిండీస్​తో ఓటమి పాలైంది. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా గబ్బాలో ఆసీస్​కు ఓటమి లేదు. అయితే అదే గ్రౌండ్​లో 2021 జనవరి 19న టీమ్ఇండియా, ప్రత్యర్థిని ఓడించడంతో యువ భారత్​పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.

ఈ టెస్టు సిరీస్​లో గబ్బా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్​లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్ అజింక్యా రహానే, గిల్, మయంక్ అగర్వాల్, రిషభ్ పంత్, సుందర్​ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది. ​

చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్

'ఆ విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం'

Ind vs Eng Lords Sourav Ganguly Celebration: టీమ్ఇండియా లెజెండరీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ లార్డ్స్​ మాస్ సెలబ్రేషన్స్​కు శనివారం (జులై 13)తో 22ఏళ్లు పూర్తైంది. రెండు దశాబ్దాల కిందట గంగూలీ నేతృత్వంలోని టీమ్ఇండియా లార్డ్స్ మైదానం వేదికగా ​నాట్​వెస్ట్​ సిరీస్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​పై చారిత్రక విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్​ 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా 49.3 ఓవర్లలో 8 కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.

అయితే ఈ విక్టరీని బాల్​కనీ​లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ గంగూలీ తన జెర్సీ తీసి మాస్ లెవెల్​లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో ఇది సంచలనంగా మారింది. ఇది టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ విజయంలో అప్పటి జట్టులో సభ్యులు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్ అదరగొట్టారు.

325 లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (62 పరుగులు) తొలి వికెట్​కు 106 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. ఇక సచిన్ తెందూల్కర్ (14), ద్రవిడ్ (5) విఫలమయ్యారు. దీంతో మిడిలార్డర్​లో యువరాజ్ సింగ్ (69 పరుగులు), మహ్మద్ కైఫ్ (87*) సూపర్ ఇన్నింగ్స్​తో టీమ్ఇండియాకు సూపర్ విక్టరీ అందించారు.

ఆ విజయమూ చరిత్రకత్మకమే: 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్, గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్​కు ఓటమి రుచి చూపించింది. అయితే గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువేమీ కాదన క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడి ఫ్లాట్ పిచ్​లపై పేసర్లు సంధించే బౌన్సర్లను ఎదుర్కొవడం కూడా బ్యాటర్లకు సవాలే. అప్పటివరకు ఆసీస్ గబ్బా గ్రౌండ్​లో 1988లో వెస్టిండీస్​తో ఓటమి పాలైంది. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా గబ్బాలో ఆసీస్​కు ఓటమి లేదు. అయితే అదే గ్రౌండ్​లో 2021 జనవరి 19న టీమ్ఇండియా, ప్రత్యర్థిని ఓడించడంతో యువ భారత్​పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.

ఈ టెస్టు సిరీస్​లో గబ్బా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్​లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్ అజింక్యా రహానే, గిల్, మయంక్ అగర్వాల్, రిషభ్ పంత్, సుందర్​ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది. ​

చారిత్రక విజయానికి మూడేళ్లు- 'గబ్బా' విక్టరీపై బీసీసీఐ స్పెషల్ ట్వీట్

'ఆ విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.