ETV Bharat / sports

146కే బంగ్లా ఆలౌట్​ - టీమ్ఇండియా టార్గెట్ 95 రన్స్​ - India Vs Bangldesh 2nd Test

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IND Vs BAN 2nd Test : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు చివరిరోజు భారత్ అద్భుతంగా ఆడింది. మన బౌలర్లు దాటికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌ లక్ష్యం 95 పరుగులుగా మారింది.

India Vs Bangldesh 2nd Test
India Vs Bangldesh 2nd Test (Associated Press)

IND Vs BAN 2nd Test : కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌, జడేజా మెరుపులకు బంగ్లా ఆఖరి రోజు ఆటలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ గేమ్​లో అశ్విన్‌, జడేజా, బుమ్రా మూడేసి వికెట్లు తీయగా, ఆకాశ్‌ దీప్‌ మాత్రం ఒక వికెట్​ను పడగొట్టాడు. దీంతో భారత్‌ లక్ష్యం 95 పరుగులుగా మారింది.

భారత స్పిన్‌కు బంగ్లాదేశ్‌ ధీటుగా పోరాడింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటౌట్ సెంచరీ చేసిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద అశ్విన్ వికెట్ కోల్పోయాడు. లెగ్‌సైడ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. మిగతా ఆటగాళ్లంతా తక్కువ పరుగులు స్కోర్ చేసి ఔటయ్యారు. ముజ్ఫికర్ రహీమ్ (37) మాత్రమే చివరి వరకు పోరాడి జట్టును ఆదుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ 146 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

అయితే ఖలెద్‌ (5*)తో కలిసి దాదాపు ఆరు ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయాన్ని పొడిగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

వర్షం కారణంగా 2వ, 3వ రోజు మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యాయి. ఈ సందర్భంలో, బంగ్లాదేశ్ జట్టు నాలుగో రోజు నిన్న (సెప్టెంబర్ 30) మళ్లీ బ్యాటింగ్ చేసింది. భారత ఆటగాళ్ల చక్కటి బౌలింగ్‌కు బంగ్లాదేశ్‌ 233 పరుగులకే ఆలౌటైంది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు హోరా హోరీగా ఆడి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (72), విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (68) అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

52 పరుగుల వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రంగంలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.

IND Vs BAN 2nd Test : కాన్పూర్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌, జడేజా మెరుపులకు బంగ్లా ఆఖరి రోజు ఆటలో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ గేమ్​లో అశ్విన్‌, జడేజా, బుమ్రా మూడేసి వికెట్లు తీయగా, ఆకాశ్‌ దీప్‌ మాత్రం ఒక వికెట్​ను పడగొట్టాడు. దీంతో భారత్‌ లక్ష్యం 95 పరుగులుగా మారింది.

భారత స్పిన్‌కు బంగ్లాదేశ్‌ ధీటుగా పోరాడింది. తొలి ఇన్నింగ్స్‌లో నాటౌట్ సెంచరీ చేసిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగుల వద్ద అశ్విన్ వికెట్ కోల్పోయాడు. లెగ్‌సైడ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. మిగతా ఆటగాళ్లంతా తక్కువ పరుగులు స్కోర్ చేసి ఔటయ్యారు. ముజ్ఫికర్ రహీమ్ (37) మాత్రమే చివరి వరకు పోరాడి జట్టును ఆదుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ 146 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

అయితే ఖలెద్‌ (5*)తో కలిసి దాదాపు ఆరు ఓవర్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయాన్ని పొడిగిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

వర్షం కారణంగా 2వ, 3వ రోజు మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయ్యాయి. ఈ సందర్భంలో, బంగ్లాదేశ్ జట్టు నాలుగో రోజు నిన్న (సెప్టెంబర్ 30) మళ్లీ బ్యాటింగ్ చేసింది. భారత ఆటగాళ్ల చక్కటి బౌలింగ్‌కు బంగ్లాదేశ్‌ 233 పరుగులకే ఆలౌటైంది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు హోరా హోరీగా ఆడి 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (72), విరాట్ కోహ్లీ (47), కేఎల్ రాహుల్ (68) అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

52 పరుగుల వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రంగంలోకి దిగింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.