ETV Bharat / sports

ఆ ప్లేయర్స్​కు షాకిచ్చిన బీసీసీఐ - గంభీర్ రాకతో మారిన రూల్స్​! - BCCI Test Cricketers

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:37 PM IST

TestCricket Players Domestic Cricket : హెడ్ కోచ్​ గంభీర్ అప్పుడే తన మార్క్ కోచింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు సమాచారం.

source ANI
TestCricket Players (source ANI)

TestCricket Players Domestic Cricket : భారత క్రికెట్‌ హెడ్​ కోచ్​గా గంభీర్‌ ఇటీవలే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో లంకతో టీమ్​ఇండియా ఆడబోయే టీ20, వన్డే సిరీస్​లతో గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే దీనికి మరో 15 రోజులు సమయం ఉండగానే గంభీర్ తన మార్క్ కోచింగ్​ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా బోర్డు భారత జట్టు టెస్టు స్పెషలిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్​లో జరగబోయే దులీప్‌ ట్రోఫీకి టెస్టు టీమ్​ రెగ్యులర్ ప్లేయర్స్​ అందుబాటులో ఉండాలని పేర్కొంది. ప్రతి ప్లేయర్​ కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.

సెప్టెంబరులో స్వదేశంలో మొదలుకానున్న టెస్టు సీజన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. కాగా, సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో భారత టెస్ట్‌ సీజన్‌ మొదలుకానుంది. అనంతరం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరగగా, నవంబర్‌ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు టీమ్​ఇండియా ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్లి ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.

ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరంగా ఉంటే సమయంలో దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండాలని బోర్డు కార్యదర్శి జై షా అన్నారు. కానీ స్టార్‌ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ ముగ్గురు ప్లేయర్స్​ గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"ఈ సారి దులీప్ ట్రోఫీ కోసం జోనల్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయలేదు. నేషనల్ సెలక్షన్ కమిటీ మాత్రమే ఈ దులీప్ ట్రోఫీ టీమ్స్​ను సెలెక్ట్ చేస్తుంది. టెస్ట్ టీమ్​ పోటీదారులందరినీ సెలక్ట్ చేస్తారు. అయితే విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడాలా? వద్దా అనేది వారి నిర్ణయానికే వదిలేశాం" అని బీసీసీఐకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్​ - అదరగొట్టిన హర్మన్​ ప్రీత్​, షెఫాలీ - ICC T20 rankings

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

TestCricket Players Domestic Cricket : భారత క్రికెట్‌ హెడ్​ కోచ్​గా గంభీర్‌ ఇటీవలే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో లంకతో టీమ్​ఇండియా ఆడబోయే టీ20, వన్డే సిరీస్​లతో గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే దీనికి మరో 15 రోజులు సమయం ఉండగానే గంభీర్ తన మార్క్ కోచింగ్​ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా బోర్డు భారత జట్టు టెస్టు స్పెషలిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్​లో జరగబోయే దులీప్‌ ట్రోఫీకి టెస్టు టీమ్​ రెగ్యులర్ ప్లేయర్స్​ అందుబాటులో ఉండాలని పేర్కొంది. ప్రతి ప్లేయర్​ కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.

సెప్టెంబరులో స్వదేశంలో మొదలుకానున్న టెస్టు సీజన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. కాగా, సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో భారత టెస్ట్‌ సీజన్‌ మొదలుకానుంది. అనంతరం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరగగా, నవంబర్‌ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు టీమ్​ఇండియా ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్లి ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది.

ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్​లకు దూరంగా ఉంటే సమయంలో దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండాలని బోర్డు కార్యదర్శి జై షా అన్నారు. కానీ స్టార్‌ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ ముగ్గురు ప్లేయర్స్​ గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

"ఈ సారి దులీప్ ట్రోఫీ కోసం జోనల్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయలేదు. నేషనల్ సెలక్షన్ కమిటీ మాత్రమే ఈ దులీప్ ట్రోఫీ టీమ్స్​ను సెలెక్ట్ చేస్తుంది. టెస్ట్ టీమ్​ పోటీదారులందరినీ సెలక్ట్ చేస్తారు. అయితే విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడాలా? వద్దా అనేది వారి నిర్ణయానికే వదిలేశాం" అని బీసీసీఐకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి.

ఐసీసీ ర్యాంకింగ్స్​ - అదరగొట్టిన హర్మన్​ ప్రీత్​, షెఫాలీ - ICC T20 rankings

పారిస్​ ఒలింపిక్స్​ - ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది అథ్లెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.