ETV Bharat / spiritual

గోధుమపిండితో షిర్డీసాయి లీల! కలరా వ్యాధి అలా తగ్గిందని భక్తుల నమ్మకం!! - Shirdi Sai Leelalu

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 4:05 AM IST

Shirdi Sai Leelalu In Telugu : కొందరు సాయిబాబా సాక్షాత్తూ దత్తాత్రేయ స్వామి అవతారమని అంటారు. కొందరు సాయిని ఫకీరు అంటారు. కానీ తనను ఎలా పూజిస్తున్నారో వారికి ఆ స్వరూపంగానే బాబా దర్శనమిస్తారని భక్తులు నమ్ముతారు. అదే సమయంలో సాయి సచ్చరిత్రలో ఉన్న లీలలను కూడా బాగా నమ్ముతారు. అందులో ఒకటి మీకోసం!

Shirdi Sai Leelalu
Shirdi Sai Leelalu (Getty Images)

Shirdi Sai Leelalu In Telugu : షిర్డీ సాయిబాబా సంస్థ వారు అందించిన సాయి సచ్చరిత్రలో వివరించిన ప్రకారం షిర్డీ సాయి తన 16 సంవత్సరాల వయసులో షిర్డీ గ్రామంలో ప్రవేశించారు. పాడుబడిన మసీదులోని నివసిస్తూ ఉండేవారు. తన భక్తులకు ఏ ఆపద వచ్చినా బాబా వారు తానే స్వయంగా ఆపద తొలగించేందుకు పూనుకునేవారు. ఈ సమయంలో బాబా ప్రదర్శించిన లీలలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి! అలాంటి ఓ లీల గురించి తెలుసుకుందాం.

బాబా గోధుమలు విసురుట
శ్రీ సాయిబాబాకు ప్రియమైన భక్తుడు, అత్యంత సన్నిహితుడు హేమాడపంత్ స్వయంగా అనుభవించిన లీల ఇది. దాదాపు 1910 ప్రాంతంలో ఓ రోజు హేమాడపంత్ బాబా దర్శనానికి మసీదుకు వెళ్లేసరికి బాబా గోధుమలు విసరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అది చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. బిక్షాటన చేస్తూ జీవించే బాబాకు గోధుమలు విసిరే అవసరం ఎందుకు వచ్చింది? ఆ గోధుమ పిండిని ఆయన ఏమి చేసుకుంటాడు ఇలా అనేక సందేహాలు ఆ సమయంలో ఆయనను చుట్టుముట్టాయి.

గుమికూడిన భక్తులు
అదే సమయంలో బాబా దర్శనానికి వచ్చిన మరికొందరు కూడా ఇదే విషయం చర్చించుకుంటూ బాబా చర్యలు వింతగా చూడసాగారు. బాబా వారు ఓ గొనె సంచి పరుచుకొని తిరగలి ముందు పెట్టుకొని గోధుమలు విసరడం మొదలు పెట్టారు. ఈ వింతను అందరూ విచిత్రంగా చూస్తూ బాబాకు గోధుమ పిండితో ఏమి అవసరం అని తమలో తామే మాట్లాడుకోసాగారు. ఒక నలుగురు మహిళలు మాత్రం ధైర్యం చేసి మసీదు మెట్లు ఎక్కి లోనికి పోయి చొరవగా బాబాను పక్కకు జరిపి వారే పిండి విసరడం మొదలు పెట్టారు. బాబా లీలలు పాడుకుంటూ వారు పిండి విసురుతూ వారిలో వారే బాబాకు ఎలాంటి కుటుంబం లేదు ఆయనేమో భిక్షాటన చేసి జీవిస్తారు కాబట్టి ఈ పిండి మనకే ఇస్తారు అనుకుంటూ పిండి విసరసాగారు. ఇదంతా చూస్తూ బాబా వారు ముందు ఆగ్రహించినా తరువాత చిరునవ్వు నవ్వుతూ జరిగేదంతా గమనించసాగారు.

బాబా ఆగ్రహం!
పిండి విసరడం పూర్తయ్యాక ఆ మహిళలు పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసి పంచుకోవడం చూసిన బాబా పట్టరాని ఆగ్రహంతో వారి మీద మండిపడ్డారు. తానేమి వారి నుంచి గోధుమలు తీసుకోలేదని, ఈ గోధుమ పిండి వారు తీసుకోకూడదని బాబా కోపంతో అంటుంటే అందరూ భయపడిపోయారు. తరువాత కొంతసేపటికి శాంతించిన బాబా ఆ పిండిని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో చల్లమని చెప్పారు.

పొలిమేరలో పిండి చల్లిన మహిళలు
బాబా ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన మహిళలు తమలో తామే గుసగుసలాడుకుంటూ బాబా చెప్పినట్లుగా పిండిని ఊరి పొలిమేరలో చల్లారు. ఆ సమయంలో షిర్డీ గ్రామంలో కలరా తీవ్రంగా వ్యాపించి ఉంది. ఆ కలరా నివారణ కోసమే బాబా ఈ పని చేసినట్లు భక్తులు నమ్మారు. ఆ తర్వాత బాబాకు నమస్కరించారు. ఆనాటి నుంచి షిర్డీ గ్రామంలో కలరా వ్యాధి తగ్గిపోయిందని ప్రచారంలో ఉంది.

ధర్మ సూక్ష్మం
బాబా పిండి విసరడానికి కలరా తగ్గడానికి సంబంధమేమిటో చూద్దాం. బాబా తిరగలిలో గోధుమ పిండి విసురటలో వేదాంత భావం ఏమిటంటే వారు విసిరేది గోధుమలు కావు అవి భక్తుల పాపాలు అని అంతా నమ్ముతారు. తిరగలి క్రింద రాయి కర్మ అయితే, తిరగలి పై రాయి భక్తి. తిరగలి తిరగడానికి ఉపయోగించబడే పిడి జ్ఞానమని ప్రచారంలో ఉంది.

జ్ఞానమనే తిరగలి పిడిని గట్టిగా పట్టుకొని భక్తితో కర్మను అనుసంధానిస్తూ పాపాలనే గోధుమలు విసిరి వేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే ఇందులోని ప్రధాన ఉద్దేశ్యం. బాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారని ప్రచారంలో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

Shirdi Sai Leelalu In Telugu : షిర్డీ సాయిబాబా సంస్థ వారు అందించిన సాయి సచ్చరిత్రలో వివరించిన ప్రకారం షిర్డీ సాయి తన 16 సంవత్సరాల వయసులో షిర్డీ గ్రామంలో ప్రవేశించారు. పాడుబడిన మసీదులోని నివసిస్తూ ఉండేవారు. తన భక్తులకు ఏ ఆపద వచ్చినా బాబా వారు తానే స్వయంగా ఆపద తొలగించేందుకు పూనుకునేవారు. ఈ సమయంలో బాబా ప్రదర్శించిన లీలలు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాయి! అలాంటి ఓ లీల గురించి తెలుసుకుందాం.

బాబా గోధుమలు విసురుట
శ్రీ సాయిబాబాకు ప్రియమైన భక్తుడు, అత్యంత సన్నిహితుడు హేమాడపంత్ స్వయంగా అనుభవించిన లీల ఇది. దాదాపు 1910 ప్రాంతంలో ఓ రోజు హేమాడపంత్ బాబా దర్శనానికి మసీదుకు వెళ్లేసరికి బాబా గోధుమలు విసరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అది చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. బిక్షాటన చేస్తూ జీవించే బాబాకు గోధుమలు విసిరే అవసరం ఎందుకు వచ్చింది? ఆ గోధుమ పిండిని ఆయన ఏమి చేసుకుంటాడు ఇలా అనేక సందేహాలు ఆ సమయంలో ఆయనను చుట్టుముట్టాయి.

గుమికూడిన భక్తులు
అదే సమయంలో బాబా దర్శనానికి వచ్చిన మరికొందరు కూడా ఇదే విషయం చర్చించుకుంటూ బాబా చర్యలు వింతగా చూడసాగారు. బాబా వారు ఓ గొనె సంచి పరుచుకొని తిరగలి ముందు పెట్టుకొని గోధుమలు విసరడం మొదలు పెట్టారు. ఈ వింతను అందరూ విచిత్రంగా చూస్తూ బాబాకు గోధుమ పిండితో ఏమి అవసరం అని తమలో తామే మాట్లాడుకోసాగారు. ఒక నలుగురు మహిళలు మాత్రం ధైర్యం చేసి మసీదు మెట్లు ఎక్కి లోనికి పోయి చొరవగా బాబాను పక్కకు జరిపి వారే పిండి విసరడం మొదలు పెట్టారు. బాబా లీలలు పాడుకుంటూ వారు పిండి విసురుతూ వారిలో వారే బాబాకు ఎలాంటి కుటుంబం లేదు ఆయనేమో భిక్షాటన చేసి జీవిస్తారు కాబట్టి ఈ పిండి మనకే ఇస్తారు అనుకుంటూ పిండి విసరసాగారు. ఇదంతా చూస్తూ బాబా వారు ముందు ఆగ్రహించినా తరువాత చిరునవ్వు నవ్వుతూ జరిగేదంతా గమనించసాగారు.

బాబా ఆగ్రహం!
పిండి విసరడం పూర్తయ్యాక ఆ మహిళలు పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసి పంచుకోవడం చూసిన బాబా పట్టరాని ఆగ్రహంతో వారి మీద మండిపడ్డారు. తానేమి వారి నుంచి గోధుమలు తీసుకోలేదని, ఈ గోధుమ పిండి వారు తీసుకోకూడదని బాబా కోపంతో అంటుంటే అందరూ భయపడిపోయారు. తరువాత కొంతసేపటికి శాంతించిన బాబా ఆ పిండిని తీసుకెళ్లి ఊరి పొలిమేరలో చల్లమని చెప్పారు.

పొలిమేరలో పిండి చల్లిన మహిళలు
బాబా ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన మహిళలు తమలో తామే గుసగుసలాడుకుంటూ బాబా చెప్పినట్లుగా పిండిని ఊరి పొలిమేరలో చల్లారు. ఆ సమయంలో షిర్డీ గ్రామంలో కలరా తీవ్రంగా వ్యాపించి ఉంది. ఆ కలరా నివారణ కోసమే బాబా ఈ పని చేసినట్లు భక్తులు నమ్మారు. ఆ తర్వాత బాబాకు నమస్కరించారు. ఆనాటి నుంచి షిర్డీ గ్రామంలో కలరా వ్యాధి తగ్గిపోయిందని ప్రచారంలో ఉంది.

ధర్మ సూక్ష్మం
బాబా పిండి విసరడానికి కలరా తగ్గడానికి సంబంధమేమిటో చూద్దాం. బాబా తిరగలిలో గోధుమ పిండి విసురటలో వేదాంత భావం ఏమిటంటే వారు విసిరేది గోధుమలు కావు అవి భక్తుల పాపాలు అని అంతా నమ్ముతారు. తిరగలి క్రింద రాయి కర్మ అయితే, తిరగలి పై రాయి భక్తి. తిరగలి తిరగడానికి ఉపయోగించబడే పిడి జ్ఞానమని ప్రచారంలో ఉంది.

జ్ఞానమనే తిరగలి పిడిని గట్టిగా పట్టుకొని భక్తితో కర్మను అనుసంధానిస్తూ పాపాలనే గోధుమలు విసిరి వేయడం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడమే ఇందులోని ప్రధాన ఉద్దేశ్యం. బాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించారని ప్రచారంలో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.