ETV Bharat / politics

'విచారణ చేయించండి' - సీఎం చంద్రబాబును కోరిన వైఎస్ సునీత - ys sunitha met AP cm chandrababu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 5:25 PM IST

Updated : Sep 17, 2024, 7:13 PM IST

YS Sunitha Met AP CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబును వివేకా కుమార్తె సునీత దంపతులు కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని కోరారు. సునీత ఫిర్యాదుపై సీఎం సానుకూలంగా స్పందించారు.

YS Sunitha Met AP CM Chandrababu Naidu
YS Sunitha Met AP CM Chandrababu Naidu (ETV Bharat)

YS Sunitha Met AP CM Chandrababu Naidu: వివేకా కుమార్తె డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్​తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన సీఎం - కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు.

గతంలో ఆగస్టు 7వ తేదీన హోం మంత్రి వంగలపూడి అనితతో సైతం వైఎస్ సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో (Viveka Murder Case) జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు.

కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి, పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు. సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ సమయంలో అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని అన్నారు.

అనంతరం అదే రోజు సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని సునీత కలిశారు. ఉదయం హోంమంత్రి అనితను కలిసిన సునీత దంపతులు, కడపకు వచ్చి సాయంత్రం ఎస్పీని కలిశారు. వివేక హత్య కేసుకు సంబంధించి కేసు పూర్వపురాలను ఎస్పీకి వివరించారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు సహకారం అందించాలని సునీత ఎస్పీని కోరారు. ఇదే అంశాన్ని హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సునీత వివరించారు.

అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు: జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని, హూ కిల్డ్‌ బాబాయ్‌ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని గతంలో సీఎం చంద్రబాబు అసెంపబ్లీలో తెలిపారు. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని అన్నారు. తాజాగా సీఎం చంద్రబాబును నేడు సునీత కలవడంతో, తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

YS Sunitha Met AP CM Chandrababu Naidu: వివేకా కుమార్తె డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్​తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన సీఎం - కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు.

గతంలో ఆగస్టు 7వ తేదీన హోం మంత్రి వంగలపూడి అనితతో సైతం వైఎస్ సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో (Viveka Murder Case) జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు.

కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి, పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు. సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ సమయంలో అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని అన్నారు.

అనంతరం అదే రోజు సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని సునీత కలిశారు. ఉదయం హోంమంత్రి అనితను కలిసిన సునీత దంపతులు, కడపకు వచ్చి సాయంత్రం ఎస్పీని కలిశారు. వివేక హత్య కేసుకు సంబంధించి కేసు పూర్వపురాలను ఎస్పీకి వివరించారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు సహకారం అందించాలని సునీత ఎస్పీని కోరారు. ఇదే అంశాన్ని హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సునీత వివరించారు.

అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు: జగన్‌ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని, హూ కిల్డ్‌ బాబాయ్‌ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని గతంలో సీఎం చంద్రబాబు అసెంపబ్లీలో తెలిపారు. వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని అన్నారు. తాజాగా సీఎం చంద్రబాబును నేడు సునీత కలవడంతో, తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

Last Updated : Sep 17, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.