ETV Bharat / politics

ఐఎంజీ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు విచారణ - విజయసాయిరెడ్డి పిటిషన్‌ కొట్టివేత - TG High Court on IMG Land Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 9:47 PM IST

Telangana HC Rejects Vijayasai Reddy Petition : ఐఎంజీ భూముల వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్ జగన్‌ తల్లి విజయమ్మ సహా పలువురు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ ఇదే వ్యవహారం ఉందని గుర్తు చేసింది. ఈ విషయాలను ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి సహా పలువురు మరోసారి సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌ వేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకున్నట్లుందని పేర్కొంది. ఆరేళ్లు మౌనంగా ఉంటూ ఆ తర్వాత కోర్టును ఆశ్రయించడాన్ని అంగీకరించలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

TG High Court on IMG Land Case
TG High Court on IMG Land Case (ETV Bharat)

TG High Court on IMG Land Case : ఐఎంజీ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ విజయసాయిరెడ్డి సహా పలువురు 2012లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జస్టిస్ అలోక్‌ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాసరావు ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తుల పూర్వపరాలనూ పరిశీలించాల్సి ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్లలో ఒకకరైన విజయసాయిరెడ్డి, వైఎస్​ రాజశేఖర్​రెడ్డి కుటుంబం సలహాదారు అని హైకోర్టు తెలిపింది. జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు జరిపిన భూకేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ఐఎంజీ వ్యవహారం ఉందని న్యాయస్థానం వెల్లడించింది. ఇందులో ఐఎంజీ ఎండీ అహోబిలరావు ప్రతివాదులుగా ఉన్నారని గుర్తు చేసింది. హైకోర్టుతోపాటు, సుప్రీంకోర్టు కూడా విజయమ్మ పిటిషన్‌ను కొట్టివేసిందని ధర్మాసనం వెల్లడించింది.

IMG Land Case Updates : జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌ దాఖలులో జాప్యానికి కూడా ఎలాంటి కారణాలను పేర్కొనలేదని తెలిపింది. ఈ కారణంగా దీనిని అనుమతించలేమని స్పష్టం చేసింది. పూర్వ ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ, ప్రైవేట్ పిటిషన్లలోనూ తేల్చిన అంశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. పిటిషనర్లు అదే అంశంపై మళ్లీ విచారణ కోరజాలరంటూ వాటిని హైకోర్టు కొట్టివేసింది.

TG High Court on IMG Land Case : ఐఎంజీ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ విజయసాయిరెడ్డి సహా పలువురు 2012లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జస్టిస్ అలోక్‌ అరాధే, జస్టిస్ జే.శ్రీనివాసరావు ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తుల పూర్వపరాలనూ పరిశీలించాల్సి ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.

పిటిషనర్లలో ఒకకరైన విజయసాయిరెడ్డి, వైఎస్​ రాజశేఖర్​రెడ్డి కుటుంబం సలహాదారు అని హైకోర్టు తెలిపింది. జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారని పేర్కొంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు జరిపిన భూకేటాయింపులపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో ఐఎంజీ వ్యవహారం ఉందని న్యాయస్థానం వెల్లడించింది. ఇందులో ఐఎంజీ ఎండీ అహోబిలరావు ప్రతివాదులుగా ఉన్నారని గుర్తు చేసింది. హైకోర్టుతోపాటు, సుప్రీంకోర్టు కూడా విజయమ్మ పిటిషన్‌ను కొట్టివేసిందని ధర్మాసనం వెల్లడించింది.

IMG Land Case Updates : జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌ దాఖలులో జాప్యానికి కూడా ఎలాంటి కారణాలను పేర్కొనలేదని తెలిపింది. ఈ కారణంగా దీనిని అనుమతించలేమని స్పష్టం చేసింది. పూర్వ ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ, ప్రైవేట్ పిటిషన్లలోనూ తేల్చిన అంశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. పిటిషనర్లు అదే అంశంపై మళ్లీ విచారణ కోరజాలరంటూ వాటిని హైకోర్టు కొట్టివేసింది.

వైఎస్‌ జగన్‌ పాసుపోర్టు కష్టాలు- లండన్‌ ప్రయాణం ఎలా? - High Court on Jagan Petition

వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు - ముందస్తు బెయిల్ నిరాకరణ - AP HC on YSRCP Bail Petitions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.