ETV Bharat / politics

పోచారంతో మొదలైంది - త్వరలోనే మరో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి : దానం నాగేందర్ - Danam Nagender on Congress Joinings

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 12:29 PM IST

Updated : Jun 21, 2024, 1:51 PM IST

MLA Danam Nagender interesting Comments : రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలోనే కాంగ్రెస్​ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు చేరనున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. గులాబీ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్​ ప్రముఖ నేత పోచారం శ్రీనివాస రెడ్డి హస్తం గూటికి చేరారు. ​

TELANGANA CONGRESS JOININGS
MLA Danam Nagender interesting Comments (ETV Bharat)

MLA Danam Nagender interesting Comments : త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్​ నేత కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్​ ప్రముఖ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డే ఇప్పిటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొన్నారు.

MLA Danam Nagender on BRS : రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్​ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్​ గౌడ్ చేరిక ఉంటుందని వెల్లడించారు.

ఎమ్మెల్యేలైన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్​రావు, కేటీఆర్​లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారన్నారని దానం నాగేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్​రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని వెల్లడించారు. అయోమయంలో పడిన బీఆర్​ఎస్​ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడాలనుకుంటున్నారని తెలిపారు.

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ - కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్​ రెడ్డి - CM Revanth Met Pocharam

Pocharam Srinivas Reddy Join Congress : మాజీ సభాపతి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో పోచారం సలహాలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం రేవంత్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయనకు మద్దతుగా నిలిచేందుకే హస్తం పార్టీలో చేరినట్టు పోచారం తెలిపారు.

BRS Leaders Join Congress in Telangana : లోక్​సభ ఎన్నికల జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువ మంది బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్​ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముగియగానే హస్తం పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీ నాయకులు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ప్రోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పడు హస్తం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు నిజమవుతాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది.

కాంగ్రెస్​లో చేరికలపై ఏఐసీసీ కమిటీ - పార్టీలోకి ఎవరు వచ్చినా కండువా కప్పాల్సిందే - AIcc Committee For Joinings

MLA Danam Nagender interesting Comments : త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి 20 మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్​ నేత కేసీఆర్ విధానాలే ఆ పార్టీని ముంచాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్​ ప్రముఖ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డే ఇప్పిటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కొన్నారు.

MLA Danam Nagender on BRS : రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్​ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్​లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్​ గౌడ్ చేరిక ఉంటుందని వెల్లడించారు.

ఎమ్మెల్యేలైన పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్​రావు, కేటీఆర్​లు తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి వస్తారన్నారని దానం నాగేందర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్​రావుతో కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని వెల్లడించారు. అయోమయంలో పడిన బీఆర్​ఎస్​ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడాలనుకుంటున్నారని తెలిపారు.

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ - కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్​ రెడ్డి - CM Revanth Met Pocharam

Pocharam Srinivas Reddy Join Congress : మాజీ సభాపతి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తరుణంలో పోచారం సలహాలు ప్రభుత్వానికి ఎంతో అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం రేవంత్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయనకు మద్దతుగా నిలిచేందుకే హస్తం పార్టీలో చేరినట్టు పోచారం తెలిపారు.

BRS Leaders Join Congress in Telangana : లోక్​సభ ఎన్నికల జరుగుతున్న సమయంలో కూడా ఎక్కువ మంది బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్​ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముగియగానే హస్తం పార్టీలోకి వచ్చేందుకు ఇతర పార్టీ నాయకులు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్​ నాయకులు తెలిపారు. ప్రస్తుతం ప్రోచారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అప్పడు హస్తం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు నిజమవుతాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది.

కాంగ్రెస్​లో చేరికలపై ఏఐసీసీ కమిటీ - పార్టీలోకి ఎవరు వచ్చినా కండువా కప్పాల్సిందే - AIcc Committee For Joinings

Last Updated : Jun 21, 2024, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.