ETV Bharat / politics

'మమ్మల్ని మన్నించండి కామ్రేడ్' - పోలీసుల అత్యుత్సాహంపై 'ఎక్స్'​లో లోకేశ్ పోస్ట్​ - nara Lokesh Fire On Police Behavior

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 8:05 AM IST

Minister Nara Lokesh Fire On Police Behavior: సీఎం చంద్రబాబు శ్రీశైలం, మడకశిర పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ప్రాంత సీపీఎం నేతలను అరెస్ట్‌ చేసిన ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. నేతలను అరెస్టు చేసినందుకు మన్నించాలని కోరారు.

Minister Nara Lokesh Fire On Police Behavior
Minister Nara Lokesh Fire On Police Behavior (ETV Bharat)

Minister Nara Lokesh Fire On Police Behavior : రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పోలీసు శాఖ తీరు మాత్రం ఇంకా మారలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవలంభించిన తీరునే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నారు. తన పర్యటనలో పరదాల సంస్కృతిని మానుకోవాలని, సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు ముగింపు పలకాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా "మేమింతే.. మా తీరింతే" అనే విధంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గురువారం చంద్రబాబు శ్రీశైలం, మడకశిరలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం, సీపీఎం నేతలను పోలీసులు గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతలను అరెస్టు చేసినందుకు మన్నించాలని నారా లోకేశ్​ కోరారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆయన పోస్టు పెట్టారు.

వైఎస్సార్సీపీ కుట్రలపై నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! - HarishKumarGupta on Police Behavior

సీఎం శ్రీశైలం పర్యటన : ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో పోలీసు శాఖ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం పర్యటన పేరుతో ప్రకాశం జిల్లా దోర్నాలలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత, సీపీఎం నేతల అరెస్ట్​పై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన : సీపీఎం నేతల అరెస్ట్​పై మంత్రి నారా లోకేశ్ మన్నించండి కామ్రేడ్ అంటూ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Unilateral Attitude of Police in the State: పోలీసుల ఏకపక్ష వైఖరి.. ప్రతిపక్షాలపైనే కేసులు.. వైసీపీ వారిపై ఒక్క కేసూ పెట్టరా..!

గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనను కవర్ చేసేందుకు వస్తున్న మీడియా వాహనాన్ని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరు ఆందోళనకరం- దుర్గారావు ప్రాణాలతో ఉన్నాడా లేడా? : బోండా ఉమ - CM JAGAN STONE attake CASE

Minister Nara Lokesh Fire On Police Behavior : రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పోలీసు శాఖ తీరు మాత్రం ఇంకా మారలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవలంభించిన తీరునే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నారు. తన పర్యటనలో పరదాల సంస్కృతిని మానుకోవాలని, సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు ముగింపు పలకాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా "మేమింతే.. మా తీరింతే" అనే విధంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గురువారం చంద్రబాబు శ్రీశైలం, మడకశిరలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం, సీపీఎం నేతలను పోలీసులు గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతలను అరెస్టు చేసినందుకు మన్నించాలని నారా లోకేశ్​ కోరారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో ఆయన పోస్టు పెట్టారు.

వైఎస్సార్సీపీ కుట్రలపై నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! - HarishKumarGupta on Police Behavior

సీఎం శ్రీశైలం పర్యటన : ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో పోలీసు శాఖ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం పర్యటన పేరుతో ప్రకాశం జిల్లా దోర్నాలలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత, సీపీఎం నేతల అరెస్ట్​పై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన : సీపీఎం నేతల అరెస్ట్​పై మంత్రి నారా లోకేశ్ మన్నించండి కామ్రేడ్ అంటూ క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.

Unilateral Attitude of Police in the State: పోలీసుల ఏకపక్ష వైఖరి.. ప్రతిపక్షాలపైనే కేసులు.. వైసీపీ వారిపై ఒక్క కేసూ పెట్టరా..!

గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. సీఎం పర్యటనను కవర్ చేసేందుకు వస్తున్న మీడియా వాహనాన్ని నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరు ఆందోళనకరం- దుర్గారావు ప్రాణాలతో ఉన్నాడా లేడా? : బోండా ఉమ - CM JAGAN STONE attake CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.