ETV Bharat / politics

'హామీలన్నీ అమలయ్యే దాకా కాంగ్రెస్​ను వదిలేది లేదు' - 'ప్రశ్నిస్తున్న తెలంగాణ' పోస్టర్, వెబ్​సైట్​ ఆవిష్కరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 9:03 PM IST

Kishan Reddy Launched Poster Website : ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్​, వెబ్​సైట్​ను ఆవిష్కరించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలయ్యేంత వరకు ఆ పార్టీని వెంటాడుతునే ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూడోసారి ప్రధాని అవ్వబోయేది మోదీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Kishan Reddy Launched Poster Website
Kishan Reddy Launched Poster Website

Kishan Reddy Launched Poster,Website : ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్​ను వెంటాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. బీజేపీ నేత లక్ష్మణ్​తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్​సైట్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

Kishan Reddy Fires On BRS : బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ (Telangana) తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇస్తారా ఇవ్వరా? చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి

"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు చేస్తారో? చెయ్యరో చెప్పాలి. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తాం. రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఎప్పుడిస్తారు? నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేలు భృతి ఇస్తామన్నారు. ఏమైంది? వీటంన్నింటినీ ప్రశ్నిస్తున్న తెలంగాణ, డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తాం."- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Kishan Reddy On BJP Digital Campaign : నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్-వెబ్ సైట్​ను (Poster Website) రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​తో కలిసి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. ''కాంగ్రెస్ పాపాలపై పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్​పై ఒత్తిడి తెస్తాం. తెలంగాణ సమాజానికి బీజేపీ అండగా నిలుస్తుందని, వారిని చైతన్యవంతం చేస్తాం" అని కిషన్ రెడ్డి చెప్పారు. రాబోయే 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉంటే పోటీ చేస్తుంది, లేదంటే కాంగ్రెస్సే ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మూడోసారి ప్రధాని (Prime Minister) అయ్యేది మోదీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ Vs కాంగ్రెస్- ద‌క్షిణాదిపైనే గురి- కమలదళం 'టార్గెట్‌ 370' సాధ్యమయ్యేనా?

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది : ప్రధాని మోదీ

లోక్​సభ ఎన్నికల వేళ రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం - గెలుపు గుర్రం కోసం అన్వేషణ

Kishan Reddy Launched Poster,Website : ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్​ను వెంటాడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. బీజేపీ నేత లక్ష్మణ్​తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్​సైట్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

Kishan Reddy Fires On BRS : బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ (Telangana) తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇస్తారా ఇవ్వరా? చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే - కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలి : కిషన్ రెడ్డి

"రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు చేస్తారో? చెయ్యరో చెప్పాలి. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తాం. రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఎప్పుడిస్తారు? నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేలు భృతి ఇస్తామన్నారు. ఏమైంది? వీటంన్నింటినీ ప్రశ్నిస్తున్న తెలంగాణ, డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తాం."- కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

Kishan Reddy On BJP Digital Campaign : నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో పోస్టర్-వెబ్ సైట్​ను (Poster Website) రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​తో కలిసి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. ''కాంగ్రెస్ పాపాలపై పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి, కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతాం. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్​పై ఒత్తిడి తెస్తాం. తెలంగాణ సమాజానికి బీజేపీ అండగా నిలుస్తుందని, వారిని చైతన్యవంతం చేస్తాం" అని కిషన్ రెడ్డి చెప్పారు. రాబోయే 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉంటే పోటీ చేస్తుంది, లేదంటే కాంగ్రెస్సే ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మూడోసారి ప్రధాని (Prime Minister) అయ్యేది మోదీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ Vs కాంగ్రెస్- ద‌క్షిణాదిపైనే గురి- కమలదళం 'టార్గెట్‌ 370' సాధ్యమయ్యేనా?

బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ మధ్య తెలంగాణ నలిగిపోయింది : ప్రధాని మోదీ

లోక్​సభ ఎన్నికల వేళ రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం - గెలుపు గుర్రం కోసం అన్వేషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.