ETV Bharat / politics

వైఎస్సార్ జయంతికి ఏర్పాట్లు - కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకేను ఆహ్వానించిన షర్మిల - SHARMILA MEET DK SHIVA KUMAR

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 12:44 PM IST

sharmila meet DK : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కలిసిన ఆమె తాజాగా బెంగళూరులో డీకేను కలిసి ఆహ్వానించారు.

sharmila_meet_dk_shivakumar
sharmila_meet_dk_shivakumar (ETV Bharat)

Sharmila meet Karnataka Deputy CM DK : వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేసి ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో వారిని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని భేటీ అనంతరం షర్మిల ఎక్స్​లో ట్వీట్​ చేశారు. భవిష్యత్​లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పునః వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని షర్మిల పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ తో పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల సమావేశమయ్యారు. ఈ నెల 8న తన తండ్రి YS రాజశేఖర్ రెడ్డి జయంతికి రావాలని శివకుమార్ ను ఆమె ఆహ్వానించారు. YSR జయంతి కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు.

నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : వైఎస్ షర్మిల - YS Sharmila Fires on Central Govt

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహను ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్​లోని మంత్రి నివాసానికి వెళ్లిన షర్మిల ఈ నెల 8వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. వైఎస్ఆర్ 75వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.

ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పరిపాలన సాగాలి: ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల - Sharmila Open Letter To Chandrababu

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల

Sharmila meet Karnataka Deputy CM DK : వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేసి ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో వారిని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని భేటీ అనంతరం షర్మిల ఎక్స్​లో ట్వీట్​ చేశారు. భవిష్యత్​లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పునః వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని షర్మిల పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ తో పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల సమావేశమయ్యారు. ఈ నెల 8న తన తండ్రి YS రాజశేఖర్ రెడ్డి జయంతికి రావాలని శివకుమార్ ను ఆమె ఆహ్వానించారు. YSR జయంతి కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు.

నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : వైఎస్ షర్మిల - YS Sharmila Fires on Central Govt

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహను ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్​లోని మంత్రి నివాసానికి వెళ్లిన షర్మిల ఈ నెల 8వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. వైఎస్ఆర్ 75వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.

ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పరిపాలన సాగాలి: ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల - Sharmila Open Letter To Chandrababu

రామోజీరావుకు నివాళులర్పించిన వైఎస్ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.