ETV Bharat / politics

జంగా కృష్ణమూర్తి అనర్హత పిటిషన్​పై హైకోర్టులో విచారణ - ఎన్నికల సంఘానికి ఆదేశాలు - MLC Janga Krishna Murthy petition

MLC Janga Krishna Murthy's Disqualification Petition : ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి అనర్హత వేటు పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధం మని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించగా.. స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 1:21 PM IST

mlc_janga_krishna_murthy_petition
mlc_janga_krishna_murthy_petition (ETV Bharat)

MLC Janga Krishna Murthy's Disqualification Petition : తనపై ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయడంపై జంగా కృష్ణ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్​ను అనర్హునిగా ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం మే 14న పిటిషనర్​పై అనర్హత వేటు విధించారు. దీన్ని సవాల్ చేస్తూ జంగా కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం నేతి బీర చందమే: జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishna Murthy on YSRCP

మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాలపై వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. పార్టీ మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాల తరబడి వేటు వేయకుండా ఎమ్మెల్సీనైన తనపై వేటు వేయడమేంటని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు జగన్‌ తనను పొగుడుతూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. గురజాల సభలో మాట్లాడిన జగన్​.. తనకు అన్యాయం చేయనని చెప్పి కనీసం మాట్లాడే అవకాశం లేకుండా అనర్హత వేటు వేశారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీ వర్గాలను ఎదగనీయకుండా చేయాలని వైఎస్సార్సీపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని అన్నారు.

MLC Janga Krishna Murthy's Disqualification Petition : తనపై ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయడంపై జంగా కృష్ణ మూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్​ను అనర్హునిగా ప్రకటించారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఎన్నికల అనంతరం మే 14న పిటిషనర్​పై అనర్హత వేటు విధించారు. దీన్ని సవాల్ చేస్తూ జంగా కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్సార్సీపీలో సామాజిక న్యాయం నేతి బీర చందమే: జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishna Murthy on YSRCP

మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాలపై వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. పార్టీ మారిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంవత్సరాల తరబడి వేటు వేయకుండా ఎమ్మెల్సీనైన తనపై వేటు వేయడమేంటని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు ముందు జగన్‌ తనను పొగుడుతూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. గురజాల సభలో మాట్లాడిన జగన్​.. తనకు అన్యాయం చేయనని చెప్పి కనీసం మాట్లాడే అవకాశం లేకుండా అనర్హత వేటు వేశారని కృష్ణమూర్తి పేర్కొన్నారు. బీసీ వర్గాలను ఎదగనీయకుండా చేయాలని వైఎస్సార్సీపీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని అన్నారు.

వైఎస్సార్సీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు - నామమాత్ర పదవులిచ్చి నట్టేట ముంచారు: MLC జంగా

ఎన్నికల వేళ వైసీపీకి షాక్​ - టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి - MLC Janga Krishnamurthy Joined TDP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.