ETV Bharat / politics

జోగి రమేష్ ముందస్తు బెయిల్​ విచారణ- 22కి వాయిదా వేసిన హైకోర్టు - Jogi Ramesh Bail Petition

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 3:19 PM IST

HC on Jogi Ramesh Anticipatory Bail Petition: మాజీమంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జోగి రమేష్‌ పిటిషన్ వేశారు. ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు రమేష్ హాజరుకానున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 22కి హైకోర్టు వాయిదా వేసింది.

Jogi Ramesh Anticipatory Bail Petition
Jogi Ramesh Anticipatory Bail Petition (ETV Bharat)

HC on Jogi Ramesh Anticipatory Bail Petition: గత వైఎస్సార్సీపీ పాలనలో అరాచకాలకు తెగబడిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కేసుల భయంతో కోర్టుల నుంచి శరణు కోరుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులలో వరుస పిటిషన్లు వేస్తున్నారు. 2021లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు.​ జోగి రమేష్ పిటిషన్​పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.

మరోవైపు ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు కేసులు పెట్టారు.

జోగి రమేష్ డ్రైవర్ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేష్​తో పాటు ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి అప్పట్లో టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల జోలికి మాత్రం వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.

దీంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ గడువు జులైలోనే ముగిసింది. జోగి రమేష్​ను సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను హైదరాబాద్​లో ఉన్నందున విచారణకు రాలేనని జోగి రమేష్ సమాధానమిచ్చారు. దీంతో ఈరోజు సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని సూచించారు.

అయితే జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం విజయవాడలో అరెస్టు చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ అక్కడే ఉన్నారు. కుమారుడి వెంట ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ సాయంత్రం మంగళగిరిలో జరిగే విచారణకు జోగి రమేష్ వస్తారా లేదా? అనేది అనుమానంగా ఉంది. ఆయన ముందస్తు బెయిల్ గడువు పొడిగించాలని హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్​పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

HC on Jogi Ramesh Anticipatory Bail Petition: గత వైఎస్సార్సీపీ పాలనలో అరాచకాలకు తెగబడిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కేసుల భయంతో కోర్టుల నుంచి శరణు కోరుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులలో వరుస పిటిషన్లు వేస్తున్నారు. 2021లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు.​ జోగి రమేష్ పిటిషన్​పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.

మరోవైపు ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు కేసులు పెట్టారు.

జోగి రమేష్ డ్రైవర్ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేష్​తో పాటు ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి అప్పట్లో టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల జోలికి మాత్రం వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.

దీంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ గడువు జులైలోనే ముగిసింది. జోగి రమేష్​ను సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను హైదరాబాద్​లో ఉన్నందున విచారణకు రాలేనని జోగి రమేష్ సమాధానమిచ్చారు. దీంతో ఈరోజు సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని సూచించారు.

అయితే జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం విజయవాడలో అరెస్టు చేశారు. ఆ సమయంలో జోగి రమేష్ అక్కడే ఉన్నారు. కుమారుడి వెంట ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ సాయంత్రం మంగళగిరిలో జరిగే విచారణకు జోగి రమేష్ వస్తారా లేదా? అనేది అనుమానంగా ఉంది. ఆయన ముందస్తు బెయిల్ గడువు పొడిగించాలని హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్​పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.