ETV Bharat / politics

ఉపాధ్యాయులను ప్రభుత్వ, ప్రైవేటు అని వేరు చేయడమేంటి : హరీశ్​రావు - MLA Harish Rao comments on cm

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 5:24 PM IST

Updated : Sep 14, 2024, 5:29 PM IST

BRS MLA Harish Rao on Teachers : ఉపాధ్యాయులపై సీఎం వ్యాఖ్యలు ఖండిస్తున్నానని బీఆర్​ఎస్ నేత హరీశ్​రావు అన్నారు. టీచర్స్​ను ప్రభుత్వ, ప్రైవేటు వారంటూ వేరు చేయడం తగదని, ఇది దురదృష్టకరమైన విషయమని విచారించారు. ప్రైవేటు ఉపాధ్యాయుులకు సాలరీలో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదని అన్నారు.

BRS MLA Harish Rao Fires on CM Revanth
BRS MLA Harish Rao Fires on CM Revanth (ETV Bharatt)
ఉపాధ్యాయులను ప్రభుత్వ, ప్రైవేటు అని వేరు చేయడమేంటి : హరీశ్​రావు (ETV Bharat)

BRS MLA Harish Rao Fires on CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయుులకు వేతనాల్లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులను తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్​లో జిల్లా ట్రష్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సగటు ఆదాయం తక్కువగా ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నిధులను కేటాయించడం వల్ల, సగటు ఆదాయం ఎక్కువగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నష్టపోవడం జరుగుతోందని హరీశ్​రావు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో ఇక్కడ జనాభా తగ్గిందని అన్నారు. అదే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించకపోవడంతో జనాభా పెరిగిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు : అలాగే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో, పార్లమెంటులో దక్షిణ భారతదేశం ప్రాధాన్యత తగ్గనుందని మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్​కి ప్రభుత్వం 10 నెలలు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు హరీశ్​రావు వెల్లడించారు.

"ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల ఆరోగ్య బీమా చేయించాను. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్​కు ప్రభుత్వం 10 నెలలు అయినా రూపాయి ఇవ్వలేదుు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరం. ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలరీలో వ్యత్యాసం ఉన్నా సామర్థ్యంలో లేదు. ఇలా వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం సీఎంకు తగదు." - హరీశ్​రావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్యే

గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా? - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్

త్వరలోనే విద్యా కమిషన్ - సింగిల్​ టీచర్​ బడులను మూసివేయం : సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth congratulated Students

ఉపాధ్యాయులను ప్రభుత్వ, ప్రైవేటు అని వేరు చేయడమేంటి : హరీశ్​రావు (ETV Bharat)

BRS MLA Harish Rao Fires on CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరమని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయుులకు వేతనాల్లో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయులను తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్​లో జిల్లా ట్రష్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా మాజీమంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సగటు ఆదాయం తక్కువగా ఉన్న బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు నిధులను కేటాయించడం వల్ల, సగటు ఆదాయం ఎక్కువగా ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నష్టపోవడం జరుగుతోందని హరీశ్​రావు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించడంతో ఇక్కడ జనాభా తగ్గిందని అన్నారు. అదే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించకపోవడంతో జనాభా పెరిగిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం చిన్నచూపు : అలాగే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో, పార్లమెంటులో దక్షిణ భారతదేశం ప్రాధాన్యత తగ్గనుందని మాజీ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్​కి ప్రభుత్వం 10 నెలలు అయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు హరీశ్​రావు వెల్లడించారు.

"ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయులకు తన సొంత డబ్బులతో రూ.5 లక్షల ఆరోగ్య బీమా చేయించాను. బెస్ట్ అవెలెబుల్ స్కూల్స్​కు ప్రభుత్వం 10 నెలలు అయినా రూపాయి ఇవ్వలేదుు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరం. ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలరీలో వ్యత్యాసం ఉన్నా సామర్థ్యంలో లేదు. ఇలా వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం సీఎంకు తగదు." - హరీశ్​రావు, బీఆర్​ఎస్ ఎమ్మెల్యే

గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదా? - ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్

త్వరలోనే విద్యా కమిషన్ - సింగిల్​ టీచర్​ బడులను మూసివేయం : సీఎం రేవంత్​రెడ్డి - CM Revanth congratulated Students

Last Updated : Sep 14, 2024, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.