ETV Bharat / politics

కాంగ్రెస్​లో చేరికల చిచ్చు - పీసీసీ దూకుడుపై ఏఐసీసీ రియాక్షన్ ఎలా ఉండనుంది? - JOININGS IN TELANGANA CONGRESS

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 9:50 AM IST

AICC Focus on Telangana Congress Joinings 2024 : రాష్ట్రంలో ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడంపై ఆయా ప్రాంతాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తులపై పీసీసీ దృష్టి సారించింది. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవడంతో ఆందోళనలు నెలకొన్న వేళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాలపై దృష్టిపెట్టింది.

Confusion in Congress over inclusions
Confusion in Congress over inclusions (ETV Bharat)

AICC Focus on Telangana PCC : నేతల చేరికలపై సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తులపై పీసీసీ దృష్టిసారించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చేరికతో మనస్తాపానికి గురైన జీవన్‌రెడ్డిని బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా చేరికలను నిలుపుదల చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే జీవన్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ ఎలా స్పందిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 60 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా మరొకటి మిత్ర పక్షమైన సీపీఐకి ఒకటి మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, బీఆర్‌ఎస్‌ నుంచి తెగతెంపులు చేసుకున్న ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తోంది. కాంగ్రెస్‌,సీపీఐలకు చెందిన 66 స్థానాలతోపాటు ఎంఐఎంకు చెందిన 7 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా తీసుకుంటే మొత్తం 73 స్థానాలు ఉండగా ప్రభుత్వం కూలేందుకు ఏ మాత్రం అవకాశం లేదన్న విషయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress Joinings 2024 : అయితే కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నాయకులు కొందరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 38, బీజేపీకి చెందిన 8 కలిస్తే ఆ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సంఖ్య 46 కు చేరుతుంది దీని వల్ల ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంటుందని అంచనా వేసిన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకుని చేరికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

'జీవన్​రెడ్డిని కోల్పోయేందుకు పార్టీ సిద్దంగా లేదు - ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం' - MLC JEEVAN REDDY LIKELY TO RESIGN

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ, రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఆప్‌రేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేరికలు ఊపందుకున్నాయి. ఏకంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, బద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్‌, స్టేషన్‌ గన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ దయాకర్‌, బీర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ జీతేందర్‌ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు సునీత మహేందర్ రెడ్డి, అనిత రెడ్డి లతోపాటు పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అదిలాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరిన తరువాత స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో, వారి చేరికలను పీసీసీ ఆలా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి చేరికలకు సంబంధించి పీసీసీ వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దాదాపు నిలుపుదల చేశారని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరినైనా చేర్చుకోవాలంటే, మొదట రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ ఓకే చెప్పాలి, ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి ఓకే చేయాలి. ఆ తర్వాత చేరికల కమిటీ ద్వారా పార్టీ కండువా కప్పించుకోవాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్‌ ఎందుకని చాలా వరకు చేరికలు నిలిచిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీ దాడి కొనసాగుతోంది : కేటీఆర్

తాజాగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సంజయ్‌ మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సంజయ్‌పై పోటీ చేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అలకబూనినాడు. సంజయ్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది అంతా జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్ముణరావు, ఆది శ్రీనివాస్‌లతోపాటు ఎమ్మెల్యేలు రాజ్‌ ఠాకూర్‌, ప్రేమసాగర్‌ రావులతోపాటు పలువురు నాయకులు ఆయనను బుజ్జగించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా పోన్‌ ద్వారా ఆయనతో మాట్లాడి సర్దిచెప్పేందుకు యత్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా….తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి...తన రాజీనామా పత్రాన్ని అందచేస్తానని వెల్లడించారు.

నలభై సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న జీవన్‌ రెడ్డిని పార్టీ నుంచి బయటకు వెళ్ళనీయకుండా నిలుపుదల చేస్తామని ఆయనతో చర్చలు జరిపిన భట్టి విక్రమార్క, మంత్రి శ్రీదర్‌ బాబులు, ఇతర నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో, తాజా పరిస్థితులను దిల్లీలోని సీఎంకు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్‌ రెడ్డి, ఇటు ఏఐసీసీ పెద్దలు ఆయనతో మాట్లాడి సర్దిచెప్పి ఆయనను సముదాయిస్తారా, లేక పోతే పోనీ అని వదిలేస్తారో అన్నది వేచి చూడాల్సి ఉంది.

తెలంగాణ బీజేపీలో విభేదాలు - రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అంతర్గత వార్ - FIGHT OVER TG BJP PRESIDENT POST

AICC Focus on Telangana PCC : నేతల చేరికలపై సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్న అసంతృప్తులపై పీసీసీ దృష్టిసారించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చేరికతో మనస్తాపానికి గురైన జీవన్‌రెడ్డిని బుజ్జగించినా వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగా చేరికలను నిలుపుదల చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే జీవన్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ ఎలా స్పందిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 60 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా మరొకటి మిత్ర పక్షమైన సీపీఐకి ఒకటి మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, బీఆర్‌ఎస్‌ నుంచి తెగతెంపులు చేసుకున్న ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తోంది. కాంగ్రెస్‌,సీపీఐలకు చెందిన 66 స్థానాలతోపాటు ఎంఐఎంకు చెందిన 7 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా తీసుకుంటే మొత్తం 73 స్థానాలు ఉండగా ప్రభుత్వం కూలేందుకు ఏ మాత్రం అవకాశం లేదన్న విషయాన్ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telangana Congress Joinings 2024 : అయితే కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నాయకులు కొందరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన 38, బీజేపీకి చెందిన 8 కలిస్తే ఆ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సంఖ్య 46 కు చేరుతుంది దీని వల్ల ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉంటుందని అంచనా వేసిన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ఏఐసీసీ నుంచి అనుమతి తీసుకుని చేరికల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

'జీవన్​రెడ్డిని కోల్పోయేందుకు పార్టీ సిద్దంగా లేదు - ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తాం' - MLC JEEVAN REDDY LIKELY TO RESIGN

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ, రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్‌ పార్టీ బలహీనంగా ఉంది. అక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఆప్‌రేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చే నాయకులను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేరికలు ఊపందుకున్నాయి. ఏకంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, బద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావ్‌, స్టేషన్‌ గన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఎంపీ దయాకర్‌, బీర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు దామోదర్‌ రెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ జీతేందర్‌ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు సునీత మహేందర్ రెడ్డి, అనిత రెడ్డి లతోపాటు పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

అదిలాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరిన తరువాత స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో, వారి చేరికలను పీసీసీ ఆలా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అప్పటి నుంచి చేరికలకు సంబంధించి పీసీసీ వర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దాదాపు నిలుపుదల చేశారని చెప్పవచ్చు. ఒకవేళ ఎవరినైనా చేర్చుకోవాలంటే, మొదట రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ ఓకే చెప్పాలి, ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌ రెడ్డి ఓకే చేయాలి. ఆ తర్వాత చేరికల కమిటీ ద్వారా పార్టీ కండువా కప్పించుకోవాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్‌ ఎందుకని చాలా వరకు చేరికలు నిలిచిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీ దాడి కొనసాగుతోంది : కేటీఆర్

తాజాగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సంజయ్‌ మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి సంజయ్‌పై పోటీ చేసి ఓటమి పాలైన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అలకబూనినాడు. సంజయ్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది అంతా జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్ముణరావు, ఆది శ్రీనివాస్‌లతోపాటు ఎమ్మెల్యేలు రాజ్‌ ఠాకూర్‌, ప్రేమసాగర్‌ రావులతోపాటు పలువురు నాయకులు ఆయనను బుజ్జగించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా పోన్‌ ద్వారా ఆయనతో మాట్లాడి సర్దిచెప్పేందుకు యత్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా….తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి...తన రాజీనామా పత్రాన్ని అందచేస్తానని వెల్లడించారు.

నలభై సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న జీవన్‌ రెడ్డిని పార్టీ నుంచి బయటకు వెళ్ళనీయకుండా నిలుపుదల చేస్తామని ఆయనతో చర్చలు జరిపిన భట్టి విక్రమార్క, మంత్రి శ్రీదర్‌ బాబులు, ఇతర నాయకులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో, తాజా పరిస్థితులను దిల్లీలోని సీఎంకు నివేదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు సీఎం రేవంత్‌ రెడ్డి, ఇటు ఏఐసీసీ పెద్దలు ఆయనతో మాట్లాడి సర్దిచెప్పి ఆయనను సముదాయిస్తారా, లేక పోతే పోనీ అని వదిలేస్తారో అన్నది వేచి చూడాల్సి ఉంది.

తెలంగాణ బీజేపీలో విభేదాలు - రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అంతర్గత వార్ - FIGHT OVER TG BJP PRESIDENT POST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.