ETV Bharat / health

వాయు కాలుష్యంతో టైప్​-2 డయాబెటిస్ ముప్పు- దిల్లీ, చెన్నైలో 22శాతం ఎక్కువ! - Air Pollution Impact Diabetes

Air Pollution Impact Diabetes : వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల సమస్యతో పాటు గుండె సంబంధిత దీర్ఘకాలిక రోగాల బారినపడుతున్నారు. అయితే ఈ వాయు కాలుష్యం మధుమేహంపై కూడా ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 6:29 AM IST

Air Pollution Impact Diabetes
Air Pollution Impact Diabetes (ANI, Getty Images)

Air Pollution Impact Diabetes : కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్, గుండెపోటు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని మనకు తెలుసు. అయితే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల మధుమేహ ప్రమాదం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వెల్లడించాయి. యూఎస్, యూరప్, చైనా దేశాల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం సాధారణ వాతావరణంలో ఉండే వారికన్నా కాలుష్యంలో ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు 10g/m3 ఎక్కువగా కనిపిస్తున్నాయట. తాజాగా జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అనే మెడికల్ జర్నల్ 'Air Pollution: A New Cause of Type 2 Diabetes?' పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది.

ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వీ మోహన్ దీన్ని రచించారు. దీని ప్రకారం కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని ప్రభావితం చేసే, ఇన్సులిన్ రెసిస్టెంట్​కు దారితీసే ఎండోక్రైన్ డిస్ రప్టర్ ఎదుగుతుంది. దీని కారణంగా బీటా కణాల ఫంక్షనింగ్ తగ్గించే ప్యాంక్రీస్​కు కారణమవుతుంది. లివర్, కండరాలు, కణాల్లో ఇన్సులిన్ స్థాయిల హెచ్చు తగ్గులకు దారితీస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్​కు దారితీసే ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ కారకంగా పనిచేస్తుంది. ఈ స్టడీ కోసం దిల్లీ, చెన్నై నగరాల్లో ఉంటున్న 12,064 మంది రక్త నమూనాలను సేకరించారట. దీంట్లో వారు గుర్తించిన విషయం ఏంటంటే సాధారణ వాయువు పీల్చేవారితో పోలిస్తే కాలుష్యమైన గాలిలో జీవించే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం 22శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

దిల్లీలోనే అత్యధిక మరణాలు
ఏటా గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్నివేల మంది మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలైన ముంబయిలో సంవత్సరానికి 25,000, బీజింగ్​లో 34,000, షాంగాయ్​లో 39,000, టోక్యోలో 40,000, అత్యధికంగా దిల్లీలో 54,000వేల మంది కన్నుమూస్తున్నారు. అంతేకాదు భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాహన కాలుష్యం, పారిశుద్ధ్య లోపం ఇవన్నింటి కారణంగా కూడా మధుమేహ ప్రమాదం రెట్టింపు అవుతుందని తెలిపాయి. గాలి కాలుష్యాన్ని తగ్గించాలంటే వాహనాల నుంచి వచ్చే పొగ, పారిశ్రామిక కాలుష్యం, పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బాణాసంచా కాల్చడం తగ్గించాలి. ఫేస్ మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్లు వంటివి వాడుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Air Pollution Impact Diabetes : కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్, గుండెపోటు సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని మనకు తెలుసు. అయితే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్ల మధుమేహ ప్రమాదం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వెల్లడించాయి. యూఎస్, యూరప్, చైనా దేశాల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం సాధారణ వాతావరణంలో ఉండే వారికన్నా కాలుష్యంలో ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు 10g/m3 ఎక్కువగా కనిపిస్తున్నాయట. తాజాగా జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అనే మెడికల్ జర్నల్ 'Air Pollution: A New Cause of Type 2 Diabetes?' పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది.

ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ వీ మోహన్ దీన్ని రచించారు. దీని ప్రకారం కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని ప్రభావితం చేసే, ఇన్సులిన్ రెసిస్టెంట్​కు దారితీసే ఎండోక్రైన్ డిస్ రప్టర్ ఎదుగుతుంది. దీని కారణంగా బీటా కణాల ఫంక్షనింగ్ తగ్గించే ప్యాంక్రీస్​కు కారణమవుతుంది. లివర్, కండరాలు, కణాల్లో ఇన్సులిన్ స్థాయిల హెచ్చు తగ్గులకు దారితీస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్​కు దారితీసే ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ కారకంగా పనిచేస్తుంది. ఈ స్టడీ కోసం దిల్లీ, చెన్నై నగరాల్లో ఉంటున్న 12,064 మంది రక్త నమూనాలను సేకరించారట. దీంట్లో వారు గుర్తించిన విషయం ఏంటంటే సాధారణ వాయువు పీల్చేవారితో పోలిస్తే కాలుష్యమైన గాలిలో జీవించే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం 22శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.

దిల్లీలోనే అత్యధిక మరణాలు
ఏటా గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్నివేల మంది మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాలైన ముంబయిలో సంవత్సరానికి 25,000, బీజింగ్​లో 34,000, షాంగాయ్​లో 39,000, టోక్యోలో 40,000, అత్యధికంగా దిల్లీలో 54,000వేల మంది కన్నుమూస్తున్నారు. అంతేకాదు భారతదేశంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతుంది. వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, వాహన కాలుష్యం, పారిశుద్ధ్య లోపం ఇవన్నింటి కారణంగా కూడా మధుమేహ ప్రమాదం రెట్టింపు అవుతుందని తెలిపాయి. గాలి కాలుష్యాన్ని తగ్గించాలంటే వాహనాల నుంచి వచ్చే పొగ, పారిశ్రామిక కాలుష్యం, పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బాణాసంచా కాల్చడం తగ్గించాలి. ఫేస్ మాస్కులు, ఎయిర్ ప్యూరిఫైర్లు వంటివి వాడుతుండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అల్యూమినియం ఫాయిల్​ ప్యాక్​తో అందం డబుల్​- సెలబ్రిటీల బ్యూటీ సీక్రెట్ ఇదే! - Aluminum Foil Face Pack

విపరీతంగా జుట్టు ఊడిపోతోందా? ఇంట్లోని ఈ ఐటమ్స్​తో హెయిర్​ లాస్​కు చెక్​ పెట్టండిలా! - Tips To Stop Hair Fall

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.