ETV Bharat / entertainment

'ఆ రెండు అగ్రనిర్మాణ సంస్థలకు అహంకారం ఎక్కువ' - ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్​!

ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రెండు బడా నిర్మాణ సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు!

vikram kapadia on  Dharma productions Yash raj films
vikram kapadia on Dharma productions Yash raj films (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

ACTOR ALLEGATIONS ON PRODUCTION HOUSES : అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమా అంటే భారీగా పారితోషికం, మంచి ఫేమ్ వస్తుందనే భావన చాలా మంది నటుల్లో ఉంటుంది. అయితే తాజాగా ఓ ప్రముఖ నటుడు మాత్రం ఫిల్మ్​ ఇండస్ట్రీకి చెందిన రెండు బడా ప్రొడక్షన్​ హౌస్​లపై కీలక ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్​గా మారి చర్చకు దారీ తీశాయి.

ఆ నిర్మాణ సంస్థలు ఏవంటే? - బాలీవుడ్​లో కరణ్‌ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్‌, ఆదిత్య చోప్రా యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బడా నిర్మాణ సంస్థలుగా మంచి పేరుంది. ఈ బ్యానర్లపై పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఈ రెండు నిర్మాణ సంస్థలను ఉద్దేశించి బాలీవుడ్‌ యాక్టర్​ విక్రమ్‌ కపాడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ బాడా ప్రొడక్షన్ హౌస్​లు, ఎంత కష్టపడినా నటీ నటులకు తక్కువ రెమ్యునరేషన్​ చెల్లిస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, కపూర్‌ అండ్‌ సన్స్‌, యోధ, ది నైట్‌ మేనేజర్‌, మేడ్‌ ఇన్‌ హెవెన్‌, స్కామ్‌ 1992 వంటి హిట్​ ప్రాజెక్టుల్లో నటించారు విక్రమ్‌ కపాడియా.

"యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌, ధర్మా ప్రొడక్షన్స్​కు అహంకారం ఎక్కువ. వారు నటీ నటులకు తక్కువ పారితోషికం అందిస్తారు. ఆ సంస్థలు, మేము అగ్ర నిర్మాణ సంస్థలం. మీకు తక్కువగా డబ్బులు ఇస్తాం. అయినా కూడా మీరు సంతోషంగానే ఉండాలి. అనే భావనతో ఉంటారు. కేవలం కొందరు యాక్టర్స్​తోనే కాదు, అందరితోనూ వారు అలానే ప్రవర్తిస్తారు." అని విక్రమ్‌ కపాడియా చెప్పుకొచ్చారు.

కాగా, యాక్టర్స్​కు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడంపై రీసెంట్​గానే కరణ్‌ జోహార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటీనటులు అడిగినంత రెమ్యునరేషన్​ ఇచ్చినట్లు చెప్పారు. కానీ గత కొంత కాలంగా ఆ అలవాటు మార్చుకున్నానని చెప్పిన ఆయన, ఇకపై కూడా తాను అనుకున్నంత మొత్తంలోనే పారితోషికం చెల్లిస్తానని చెప్పారు. దానిపైనే తాజాగా విక్రమ్‌ కపాడియా స్పందిస్తూ ఆరోపణలు చేశారు.

'టార్జాన్' హీరో కన్నుమూత - సినీ ప్రముఖులు సంతాపం

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత

ACTOR ALLEGATIONS ON PRODUCTION HOUSES : అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమా అంటే భారీగా పారితోషికం, మంచి ఫేమ్ వస్తుందనే భావన చాలా మంది నటుల్లో ఉంటుంది. అయితే తాజాగా ఓ ప్రముఖ నటుడు మాత్రం ఫిల్మ్​ ఇండస్ట్రీకి చెందిన రెండు బడా ప్రొడక్షన్​ హౌస్​లపై కీలక ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్​గా మారి చర్చకు దారీ తీశాయి.

ఆ నిర్మాణ సంస్థలు ఏవంటే? - బాలీవుడ్​లో కరణ్‌ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్‌, ఆదిత్య చోప్రా యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ బడా నిర్మాణ సంస్థలుగా మంచి పేరుంది. ఈ బ్యానర్లపై పలు భారీ బడ్జెట్‌ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ఈ రెండు నిర్మాణ సంస్థలను ఉద్దేశించి బాలీవుడ్‌ యాక్టర్​ విక్రమ్‌ కపాడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ బాడా ప్రొడక్షన్ హౌస్​లు, ఎంత కష్టపడినా నటీ నటులకు తక్కువ రెమ్యునరేషన్​ చెల్లిస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా, కపూర్‌ అండ్‌ సన్స్‌, యోధ, ది నైట్‌ మేనేజర్‌, మేడ్‌ ఇన్‌ హెవెన్‌, స్కామ్‌ 1992 వంటి హిట్​ ప్రాజెక్టుల్లో నటించారు విక్రమ్‌ కపాడియా.

"యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌, ధర్మా ప్రొడక్షన్స్​కు అహంకారం ఎక్కువ. వారు నటీ నటులకు తక్కువ పారితోషికం అందిస్తారు. ఆ సంస్థలు, మేము అగ్ర నిర్మాణ సంస్థలం. మీకు తక్కువగా డబ్బులు ఇస్తాం. అయినా కూడా మీరు సంతోషంగానే ఉండాలి. అనే భావనతో ఉంటారు. కేవలం కొందరు యాక్టర్స్​తోనే కాదు, అందరితోనూ వారు అలానే ప్రవర్తిస్తారు." అని విక్రమ్‌ కపాడియా చెప్పుకొచ్చారు.

కాగా, యాక్టర్స్​కు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడంపై రీసెంట్​గానే కరణ్‌ జోహార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటీనటులు అడిగినంత రెమ్యునరేషన్​ ఇచ్చినట్లు చెప్పారు. కానీ గత కొంత కాలంగా ఆ అలవాటు మార్చుకున్నానని చెప్పిన ఆయన, ఇకపై కూడా తాను అనుకున్నంత మొత్తంలోనే పారితోషికం చెల్లిస్తానని చెప్పారు. దానిపైనే తాజాగా విక్రమ్‌ కపాడియా స్పందిస్తూ ఆరోపణలు చేశారు.

'టార్జాన్' హీరో కన్నుమూత - సినీ ప్రముఖులు సంతాపం

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.