ETV Bharat / business

దయామయుడు - మూగజీవాల కోసం భారీ ఆసుపత్రి నిర్మించిన రతన్​ టాటా

Ratan Tata Animal Hospital : టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్​ టాటాకు మూగజీవాలంటే అమితమైన ప్రేమ. అందుకే పెంపుడు జంతువుల కోసం రూ.165 కోట్లతో పెద్ద ఆసుపత్రి నిర్మించారు.

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Ratan Tata
Ratan Tata (IANS)

Ratan Tata Animal Hospital : టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. భారత్​లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది. పారిశ్రామికవేత్తగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రతన్ టాటాను అందరూ గౌరవిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే రతన్ టాటా తన కంపెనీల తరపున పేదలను ఆదుకుంటూ ఉంటారు. రతన్​ టాటాకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రిని కూడా నిర్మించారు.

ముంబయిలో జంతువుల కోసం రతన్​ టాటా అత్యాధునిక సౌకర్యాలతో 'టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హస్పిటల్' అనే పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిని సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.165 కోట్లతో నిర్మించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద జంతు వైద్యశాల కావడం గమనార్హం. ఈ ఆసుపత్రిలో కుక్కులు, పిల్లులు, కుందేళ్లు సహా ఇతర చిన్న జంతువులకు 24*7 వైద్య సేవలను అందిస్తారు.

"పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. నా జీవితం అనేక పెంపుడు జంతువుల మధ్య సాగింది. ఒక సంరక్షకుడిగా వాటికి ఆసుపత్రి అవసరం అని గుర్తించాను. అందుకే ఈ వైద్యశాలను నిర్మించాను."
- రతన్​ టాటా, టాటా గ్రూప్ ఛైర్మన్

జంతువుల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రి, లండన్​లోని రాయల్ వెటర్నరీ కాలేజ్, 5 యూకే వెటర్నరీ స్కూల్స్​తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఆస్పత్రిలో సర్జీకల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ వంటి సేవలను అందిస్తారు. ఒకేసారి 200 జంతువులకు వైద్యం అందించేలా నాలుగు అంతస్తుల్లో దీనిని నిర్మించారు. దీనిని బ్రిటన్​కు చెందిన వెటర్నరీ డాక్టర్ థామస్ హీత్​కోట్ చూసుకుంటారు.

రతన్ టాటాకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు
ఒకానొక సమయంలో రతన్​ టాటాపై ఓ గ్యాంగ్​స్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ రతన్​టాటా చాలా ధైర్యంగా అతని ఎదుర్కొని, జైలు కూడా పంపించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి

Ratan Tata Animal Hospital : టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. భారత్​లోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయనకు పేరుంది. పారిశ్రామికవేత్తగానే కాకుండా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రతన్ టాటాను అందరూ గౌరవిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే రతన్ టాటా తన కంపెనీల తరపున పేదలను ఆదుకుంటూ ఉంటారు. రతన్​ టాటాకు మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా ఓ భారీ ఆసుపత్రిని కూడా నిర్మించారు.

ముంబయిలో జంతువుల కోసం రతన్​ టాటా అత్యాధునిక సౌకర్యాలతో 'టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హస్పిటల్' అనే పేరుతో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిని సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.165 కోట్లతో నిర్మించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద జంతు వైద్యశాల కావడం గమనార్హం. ఈ ఆసుపత్రిలో కుక్కులు, పిల్లులు, కుందేళ్లు సహా ఇతర చిన్న జంతువులకు 24*7 వైద్య సేవలను అందిస్తారు.

"పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. నా జీవితం అనేక పెంపుడు జంతువుల మధ్య సాగింది. ఒక సంరక్షకుడిగా వాటికి ఆసుపత్రి అవసరం అని గుర్తించాను. అందుకే ఈ వైద్యశాలను నిర్మించాను."
- రతన్​ టాటా, టాటా గ్రూప్ ఛైర్మన్

జంతువుల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ ఆసుపత్రి, లండన్​లోని రాయల్ వెటర్నరీ కాలేజ్, 5 యూకే వెటర్నరీ స్కూల్స్​తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ఆస్పత్రిలో సర్జీకల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ వంటి సేవలను అందిస్తారు. ఒకేసారి 200 జంతువులకు వైద్యం అందించేలా నాలుగు అంతస్తుల్లో దీనిని నిర్మించారు. దీనిని బ్రిటన్​కు చెందిన వెటర్నరీ డాక్టర్ థామస్ హీత్​కోట్ చూసుకుంటారు.

రతన్ టాటాకు గ్యాంగ్‌స్టర్ నుంచి బెదిరింపులు
ఒకానొక సమయంలో రతన్​ టాటాపై ఓ గ్యాంగ్​స్టర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. కానీ రతన్​టాటా చాలా ధైర్యంగా అతని ఎదుర్కొని, జైలు కూడా పంపించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.