ETV Bharat / business

ఆర్​బీఐ నయా రూల్ - ఇకపై మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్! - Credit Report Update Rule

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 1:32 PM IST

Bank Loan Credit Report Update Rule : బ్యాంక్​ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్​న్యూస్. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ప్రతి 15 రోజులకొకసారి కస్టమర్ల క్రెడిట్ రిపోర్ట్​ను అప్డేట్ చేయాలని ఆర్​బీఐ ఆదేశించింది. ఈ నిబంధన వల్ల అర్జెంట్​గా లోన్ కావాలనుకునేవారికి మేలు జరుగుతుంది.

Credit Report Update
Credit Report Update (Getty Images)

Bank Loan Credit Report Update Rule : బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తాము సేకరించే క్రెడిట్ రిపోర్టును 15 రోజులకు ఒకసారి కచ్చితంగా అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ఆదేశించింది. గతంలో 30 రోజులకు ఒకసారి బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ నివేదికను అప్డేడ్ చేసేవి. తాజాగా ఆ గడువును 15 రోజులకు కుదిస్తూ ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం బ్యాంకులు నెలకు ఒకసారి సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును నివేదించాలి. ఈ నిర్ణయాన్ని మారుస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును అప్డేట్ చేయాలని కోరింది. ఈ నిర్ణయం అర్జెంట్​గా లోన్ కావాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ రిపోర్టును చూసి లోన్లు మంజూరు చేస్తాయి.

ఆర్​బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు ఉపయోగమేంటి?
రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఉదాహరణకు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఈజీగా లోన్లు మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే వారికి లోన్లు ఇస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడవు కూడా. అదే 550 సిబిల్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఇష్టపడవు. వారికి లోన్లు ఇవ్వడం ప్రమాదకరమని భావిస్తాయి. ఒకవేళ లోన్లు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.

ఆర్​బీఐ నోటిఫికేషన్​లోని ముఖ్య విషయాలు
బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) వారు సేకరించిన క్రెడిట్ సమాచారాన్ని 15 రోజులకొకసారి అప్డేట్ చేయాలి. అంటే నెలలోని 15వ రోజు, చివరి రోజు క్రమం తప్పకుండా అప్డేడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, సీఐసీలు సమర్పించిన క్రెడిట్ రిపోర్టు 7 రోజులలోపు నిర్ధరణ అవుతుంది. బ్యాంకుల నుంచి క్రెడిట్ నివేదికను కంపెనీలు ఐదు రోజుల్లో పొందొచ్చు. అంతకుముందు వారం రోజుల వ్యవధి ఉండేది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును సమర్పించని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై చర్యలు ఉంటాయి. పై నిబంధనలన్నీ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్నేషన్ కంపెనీలు అంతకు ముందే వీటిని అమలు చేయమని ఆర్​బీఐ ప్రతిపాదించింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ ​- అదానీ గ్రూప్ స్టాక్స్​ ఢమాల్​ - Adani Shares Today Graph

మీ ఆర్థిక భవిష్యత్ అద్భుతంగా ఉండాలా? సొంత 'బడ్జెట్ ప్లాన్'​ తయారు చేసుకోండిలా!​ - Personal Finance Tips

Bank Loan Credit Report Update Rule : బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తాము సేకరించే క్రెడిట్ రిపోర్టును 15 రోజులకు ఒకసారి కచ్చితంగా అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) ఆదేశించింది. గతంలో 30 రోజులకు ఒకసారి బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ నివేదికను అప్డేడ్ చేసేవి. తాజాగా ఆ గడువును 15 రోజులకు కుదిస్తూ ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం బ్యాంకులు నెలకు ఒకసారి సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కస్టమర్ల క్రెడిట్ రిపోర్టును నివేదించాలి. ఈ నిర్ణయాన్ని మారుస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకుంది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును అప్డేట్ చేయాలని కోరింది. ఈ నిర్ణయం అర్జెంట్​గా లోన్ కావాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంకులు కస్టమర్ క్రెడిట్ రిపోర్టును చూసి లోన్లు మంజూరు చేస్తాయి.

ఆర్​బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు ఉపయోగమేంటి?
రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాయి. అలాగే సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. ఉదాహరణకు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు ఈజీగా లోన్లు మంజూరు చేస్తాయి. అలాగే తక్కువ వడ్డీ రేటుకే వారికి లోన్లు ఇస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడవు కూడా. అదే 550 సిబిల్ స్కోరు ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ఇష్టపడవు. వారికి లోన్లు ఇవ్వడం ప్రమాదకరమని భావిస్తాయి. ఒకవేళ లోన్లు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.

ఆర్​బీఐ నోటిఫికేషన్​లోని ముఖ్య విషయాలు
బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు(సీఐసీ) వారు సేకరించిన క్రెడిట్ సమాచారాన్ని 15 రోజులకొకసారి అప్డేట్ చేయాలి. అంటే నెలలోని 15వ రోజు, చివరి రోజు క్రమం తప్పకుండా అప్డేడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, సీఐసీలు సమర్పించిన క్రెడిట్ రిపోర్టు 7 రోజులలోపు నిర్ధరణ అవుతుంది. బ్యాంకుల నుంచి క్రెడిట్ నివేదికను కంపెనీలు ఐదు రోజుల్లో పొందొచ్చు. అంతకుముందు వారం రోజుల వ్యవధి ఉండేది. 15 రోజులకొకసారి క్రెడిట్ రిపోర్టును సమర్పించని బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలపై చర్యలు ఉంటాయి. పై నిబంధనలన్నీ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్నేషన్ కంపెనీలు అంతకు ముందే వీటిని అమలు చేయమని ఆర్​బీఐ ప్రతిపాదించింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ ​- అదానీ గ్రూప్ స్టాక్స్​ ఢమాల్​ - Adani Shares Today Graph

మీ ఆర్థిక భవిష్యత్ అద్భుతంగా ఉండాలా? సొంత 'బడ్జెట్ ప్లాన్'​ తయారు చేసుకోండిలా!​ - Personal Finance Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.