ETV Bharat / bharat

లైవ్​ పెయింటింగ్​ వేసి రామోజీకి నివాళులు- భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు! - Tribute To Ramoji Rao

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 7:12 AM IST

Updated : Jun 19, 2024, 8:13 AM IST

Tribute To Ramoji Rao In Bhubaneswar : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు ఒడిశా మీడియా ప్రతినిధులు. ఈ సభలో ఇద్దరు యువకులు లైవ్​లో రామోజీరావు చిత్రాన్ని పెయింటింగ్ వేసి నివాళులర్పించారు. మరోవైపు భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు రాష్ట్రపతి, ప్రధాని లేఖలు రాయాలని నిర్ణయించారు.

Tribute to Ramoji Rao
Tribute to Ramoji Rao (ETV bharat)

Tribute To Ramoji Rao In Bhubaneswar : ఒడిశాలో ఇద్దరు యువ కళాకారులు లైవ్​లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెయింటింగ్​ వేసి ఘన నివాళులర్పించారు. భువనేశ్వర్​లోని జయదేవ్​ భవన్​లో మంగళవారం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఈ పెయింటింగ్ వేశారు. ఈ సభకు ఈటీవీ ఒడియాలో పని చేసే ఉద్యోగులతో పాటు ఒడిశా మీడియా ప్రతినిధులు, సిని పరిశ్రమకు చెందిన వారు హాజరై నివాళులర్పించారు. మీడియా ప్రపంచానికి, సినీ పరిశ్రమకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. రామోజీరావు చేసిన సేవలను గురించి వివరిస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శించారు. రామోజీరావు చేసిన సేవల గురించి వివరిస్తూ ఆయన పేరు మీద ఒక మ్యాగ్​జైన్​ను విడుదల చేశారు.

Tribute to Ramoji Rao
సంస్మరణ సభలో సంగీతం కళాకారులతో ప్రదర్శన (ETV Bharat)
Tribute to Ramoji Rao
రామోజీరావు పేరుతో మ్యాగజైన్​ విడుదల (ETV bharat)

రామోజీరావు ప్రింట్, టెలివిజన్, డిజిటల్, సినిమా, టూరిజం ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రను వేశారని సంస్మరణ సభకు వచ్చినవారు కొనియాడారు. 'గత ఐదు దశాబ్దాల్లో మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకోచ్చారు. ముఖ్యంగా వివిధ ప్రాంతీయ భాషల్లో ఈటీవీ భారత్​ను ప్రారంభించి దేశంలో అతి పెద్ద నెట్​వర్క్​గా స్థాపించగలిగారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిస్తూ మీడియా, సిని రంగాన్ని విస్తరించడంలో రామోజీరావు సూత్రధారి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు మళ్లీ పుట్టాలి' అని సభకు వచ్చినవారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Tribute to Ramoji Rao
సంస్మరణ సభకు హజరైన ప్రముఖులు (ETV Bharat)
Tribute to Ramoji Rao
రామోజీరావు సంస్మరణ సభలో నివాళులు (ETV Bharat)
Tribute To Ramoji Rao
రామోజీరావు సంస్మరణ సభ (ETV Bharat)

'రామోజీకి భారతరత్న ఇవ్వాలి'
'ఈటీవీ, ఈనాడు ద్వారా యువత ప్రతిభను వెలికితీసి, ఎంతో మంది ఉపాధికి బాటలు వేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన మరణం దేశానికి తీరని లోటు' అని ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర ఎమ్మెల్యే కె అనిల్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం బ్రహ్మపురలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామోజీరావు వేల మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు, ప్రముఖులు సభలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని తీర్మానించారు.

'ఆయన మరణం మీడియా రంగానికే శూన్యం'
ఛత్తీస్​గఢ్​లోని రాయపుర్​లో మంగళవారం మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమ కళాకారులు కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు. ఛత్తీస్​గఢ్​ ఫిల్మ్ అండ్ విజువల్ ఆర్ట్​ సొసైటీ, జర్నలిస్టులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామోజీరావు మరణించడం మీడియా రంగానికే శూన్యంలా ఉందని పేర్కొన్నారు. పాత్రికేయ రంగానికి ఆయన సేవలు ఎప్పటికీ మరిచిపోలేవని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు జర్నలిజం విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, ఆయన మాదిరిగానే ఎంతోమంది యువ జర్నలిస్టులను తయారు చేశారని తెలిపారు.

Tribute To Ramoji Rao In Bhubaneswar : ఒడిశాలో ఇద్దరు యువ కళాకారులు లైవ్​లో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెయింటింగ్​ వేసి ఘన నివాళులర్పించారు. భువనేశ్వర్​లోని జయదేవ్​ భవన్​లో మంగళవారం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఈ పెయింటింగ్ వేశారు. ఈ సభకు ఈటీవీ ఒడియాలో పని చేసే ఉద్యోగులతో పాటు ఒడిశా మీడియా ప్రతినిధులు, సిని పరిశ్రమకు చెందిన వారు హాజరై నివాళులర్పించారు. మీడియా ప్రపంచానికి, సినీ పరిశ్రమకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. రామోజీరావు చేసిన సేవలను గురించి వివరిస్తూ ఒక ప్రత్యేకమైన వీడియోను ప్రదర్శించారు. రామోజీరావు చేసిన సేవల గురించి వివరిస్తూ ఆయన పేరు మీద ఒక మ్యాగ్​జైన్​ను విడుదల చేశారు.

Tribute to Ramoji Rao
సంస్మరణ సభలో సంగీతం కళాకారులతో ప్రదర్శన (ETV Bharat)
Tribute to Ramoji Rao
రామోజీరావు పేరుతో మ్యాగజైన్​ విడుదల (ETV bharat)

రామోజీరావు ప్రింట్, టెలివిజన్, డిజిటల్, సినిమా, టూరిజం ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్రను వేశారని సంస్మరణ సభకు వచ్చినవారు కొనియాడారు. 'గత ఐదు దశాబ్దాల్లో మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకోచ్చారు. ముఖ్యంగా వివిధ ప్రాంతీయ భాషల్లో ఈటీవీ భారత్​ను ప్రారంభించి దేశంలో అతి పెద్ద నెట్​వర్క్​గా స్థాపించగలిగారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిస్తూ మీడియా, సిని రంగాన్ని విస్తరించడంలో రామోజీరావు సూత్రధారి. అలాంటి వ్యక్తిత్వం కలిగిన రామోజీరావు మళ్లీ పుట్టాలి' అని సభకు వచ్చినవారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Tribute to Ramoji Rao
సంస్మరణ సభకు హజరైన ప్రముఖులు (ETV Bharat)
Tribute to Ramoji Rao
రామోజీరావు సంస్మరణ సభలో నివాళులు (ETV Bharat)
Tribute To Ramoji Rao
రామోజీరావు సంస్మరణ సభ (ETV Bharat)

'రామోజీకి భారతరత్న ఇవ్వాలి'
'ఈటీవీ, ఈనాడు ద్వారా యువత ప్రతిభను వెలికితీసి, ఎంతో మంది ఉపాధికి బాటలు వేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన మరణం దేశానికి తీరని లోటు' అని ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర ఎమ్మెల్యే కె అనిల్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం బ్రహ్మపురలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే మాట్లాడుతూ రామోజీరావు వేల మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారతరత్న ఇవ్వడమే ఆయనకు నిజమైన నివాళి అని అక్కడి తెలుగు సంఘాల సభ్యులు, ప్రముఖులు సభలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని తీర్మానించారు.

'ఆయన మరణం మీడియా రంగానికే శూన్యం'
ఛత్తీస్​గఢ్​లోని రాయపుర్​లో మంగళవారం మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమ కళాకారులు కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు. ఛత్తీస్​గఢ్​ ఫిల్మ్ అండ్ విజువల్ ఆర్ట్​ సొసైటీ, జర్నలిస్టులు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామోజీరావు మరణించడం మీడియా రంగానికే శూన్యంలా ఉందని పేర్కొన్నారు. పాత్రికేయ రంగానికి ఆయన సేవలు ఎప్పటికీ మరిచిపోలేవని గుర్తు చేసుకున్నారు. రామోజీరావు జర్నలిజం విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, ఆయన మాదిరిగానే ఎంతోమంది యువ జర్నలిస్టులను తయారు చేశారని తెలిపారు.

Last Updated : Jun 19, 2024, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.