ETV Bharat / bharat

'ఇప్పటికీ హసీనానే బంగ్లాదేశ్​ ప్రధాని!- అవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు' - Sheikh Hasina resignation analysis

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 1:03 PM IST

Updated : Aug 8, 2024, 2:02 PM IST

Sheikh Hasina’s resignation analysis : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా తన తల్లి ఇంకా రాజీనామా చేయలేదన్నారు. అక్కడ శాంతి భద్రతలు ఇంకా అదుపులోకి రాలేదని వెల్లడించారు. 'ఈటీవీ భారత్​'తో ముచ్చటించిన సజీబ్ బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై కీలక విషయాలు షేర్​ చేసుకున్నారు.

Sheikh Hasina
Sheikh Hasina (Associated Press)

Sheikh Hasina son Sajid Wajid Comments : రాజ్యాంగ బద్ధంగా ఇంకా బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనానే అని ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ అన్నారు. బంగ్లాదేశ్​లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై నిరసనకారులు దాడులు జరపడం వల్ల వారు ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్​లో నెలకొన్న పరిస్థితులపై హసీనా కుమారుడు సాజిబ్ 'ఈటీవీ భారత్​'తో పలు కీలక విషయాలు షేర్​ చేసుకున్నారు.

"సరిహద్దు గార్డులు కొంత అల్లర్లను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢాకా వెలుపల, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ నాయకులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. షేక్ హసీనా దిల్లీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఎక్కడికి వెళ్లే ఆలోచనలో లేరు. ఆమె అవామీ లీగ్ పార్టీ నాయకులతో టచ్​లో ఉన్నారు. మా పార్టీ వ్యక్తులపై దాడులు చేసినవారిని ఎప్పటికీ విడిచిపెట్టం. రాజ్యంగ బద్ధంగా షేక్ హసీనా ఎన్నడూ రాజీనామా చేయలేదు, ఆ అవకాశం కూడా ఆమెకు రాలేదు. అది రాజ్యాంగ సమస్య. రాజ్యాంగబద్ధంగా ఇప్పటికే ఆమే బంగ్లాదేశ్​కు ప్రధాన మంత్రి. అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్​లో పురాతన, అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. అవామీ లీగ్ మళ్లీ తిరిగి వస్తోంది." అని సాజిబ్ వాజిద్ వ్యాఖ్యానించారు.

మోదీ, భారత సర్కార్​కు థ్యాంక్స్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, తన తల్లి షేక్ హసీనాకు సాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి సాజిబ్ వాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం వేగంగా స్పందించి షేక్ హసీనా ప్రాణాలను కాపాడిందని వివరించారు. బంగ్లాదేశ్​లో లౌకిక ప్రభుత్వం లేకుండా నిరసనకారులు చేశారని మండిపడ్డారు. మైనారిటీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఎవరున్నా మిలిటెన్సీని ఖండించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్​లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఢాకాలో శాంతి భద్రతలు కొంత నియంత్రణలో ఉన్నాయని, ఆ నగరం వెలుపల హింస కొనసాగుతోందని ఆరోపించారు.

'ఆ ప్రభావం భారత్​పై ఉండదు'
బంగ్లాదేశ్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపదని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభిప్రాయపడ్డారు. భారత ప్రజలు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు మళ్లీ బంగ్లాదేశ్​తో భారత్ శాంతియుత, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించగలదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సీఐఏ మద్దతుతో నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్​లో ఆర్మీ మద్దతుతో మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది భారత్​కు ఆందోళన కలిగించే విషయమే. భారత్​కు బంగ్లాదేశ్ 25వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత ఆటోమొబైల్ ఎగుమతులకు బంగ్లాదేశ్ ప్రధాన మార్కెట్​గా ఉంది." అని హర్షవర్ధన్ ష్రింగ్లా వ్యాఖ్యానించారు.

'ఇంకొన్ని రోజులు దిల్లీలోనే హసీనా'- 'బంగ్లా పరిస్థితులు భారత్​కు ఓ గుణపాఠం!' - Bangladesh Crisis

బంగ్లా సంక్షోభం​తో భారత్​కు పెను సవాళ్లు- ప్లాన్​ మార్చకపోతే మొదటికే మోసం! - Bangladesh Crisis

Sheikh Hasina son Sajid Wajid Comments : రాజ్యాంగ బద్ధంగా ఇంకా బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనానే అని ఆమె కుమారుడు సాజిబ్ వాజిద్ అన్నారు. బంగ్లాదేశ్​లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై నిరసనకారులు దాడులు జరపడం వల్ల వారు ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్​లో నెలకొన్న పరిస్థితులపై హసీనా కుమారుడు సాజిబ్ 'ఈటీవీ భారత్​'తో పలు కీలక విషయాలు షేర్​ చేసుకున్నారు.

"సరిహద్దు గార్డులు కొంత అల్లర్లను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢాకా వెలుపల, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీ నాయకులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. షేక్ హసీనా దిల్లీలో ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె ఎక్కడికి వెళ్లే ఆలోచనలో లేరు. ఆమె అవామీ లీగ్ పార్టీ నాయకులతో టచ్​లో ఉన్నారు. మా పార్టీ వ్యక్తులపై దాడులు చేసినవారిని ఎప్పటికీ విడిచిపెట్టం. రాజ్యంగ బద్ధంగా షేక్ హసీనా ఎన్నడూ రాజీనామా చేయలేదు, ఆ అవకాశం కూడా ఆమెకు రాలేదు. అది రాజ్యాంగ సమస్య. రాజ్యాంగబద్ధంగా ఇప్పటికే ఆమే బంగ్లాదేశ్​కు ప్రధాన మంత్రి. అవామీ లీగ్ పార్టీ బంగ్లాదేశ్​లో పురాతన, అతిపెద్ద రాజకీయ పార్టీ. ఆవామీ లీగ్​ కథ ఇంకా ముగిసిపోలేదు. మేము ఎక్కడికీ వెళ్లడం లేదు. అవామీ లీగ్ మళ్లీ తిరిగి వస్తోంది." అని సాజిబ్ వాజిద్ వ్యాఖ్యానించారు.

మోదీ, భారత సర్కార్​కు థ్యాంక్స్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, తన తల్లి షేక్ హసీనాకు సాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి సాజిబ్ వాజిద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం వేగంగా స్పందించి షేక్ హసీనా ప్రాణాలను కాపాడిందని వివరించారు. బంగ్లాదేశ్​లో లౌకిక ప్రభుత్వం లేకుండా నిరసనకారులు చేశారని మండిపడ్డారు. మైనారిటీలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఎవరున్నా మిలిటెన్సీని ఖండించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్​లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అభిప్రాయపడ్డారు. ఢాకాలో శాంతి భద్రతలు కొంత నియంత్రణలో ఉన్నాయని, ఆ నగరం వెలుపల హింస కొనసాగుతోందని ఆరోపించారు.

'ఆ ప్రభావం భారత్​పై ఉండదు'
బంగ్లాదేశ్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభం భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపదని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా అభిప్రాయపడ్డారు. భారత ప్రజలు ఈ విషయంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు మళ్లీ బంగ్లాదేశ్​తో భారత్ శాంతియుత, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించగలదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ ష్రింగ్లా ఈ వ్యాఖ్యలు చేశారు.

హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు సీఐఏ మద్దతుతో నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్​లో ఆర్మీ మద్దతుతో మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది భారత్​కు ఆందోళన కలిగించే విషయమే. భారత్​కు బంగ్లాదేశ్ 25వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత ఆటోమొబైల్ ఎగుమతులకు బంగ్లాదేశ్ ప్రధాన మార్కెట్​గా ఉంది." అని హర్షవర్ధన్ ష్రింగ్లా వ్యాఖ్యానించారు.

'ఇంకొన్ని రోజులు దిల్లీలోనే హసీనా'- 'బంగ్లా పరిస్థితులు భారత్​కు ఓ గుణపాఠం!' - Bangladesh Crisis

బంగ్లా సంక్షోభం​తో భారత్​కు పెను సవాళ్లు- ప్లాన్​ మార్చకపోతే మొదటికే మోసం! - Bangladesh Crisis

Last Updated : Aug 8, 2024, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.