ETV Bharat / bharat

కూలీకి దొరికిన భారీ 'డైమండ్​'- ఓవర్​నైట్​లో​ లక్షాధికారిగా మారిన స్వామి! - Diamond Found In Panna

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 10:38 AM IST

Diamond Found In Panna : మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ఓ కూలీని అదృష్టం వరించింది. మరో ముగ్గురితో కలిసి లీజుకు తీసుకున్న గనిలో అతడికి రూ.1.5 కోట్లు విలువైన వజ్రం దొరికింది.

Diamond Found In Panna
Diamond Found In Panna (ETV Bharat)

Diamond Found In Panna : భారత్​లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి 2024 మేలో సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్​కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

'పిల్లలకు ఇళ్లు కట్టిస్తాం'
పన్నా జిల్లాలోని నారంగి బాగ్​కు చెందిన స్వామిదిన్ పాల్ ఈ వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. భారీ వజ్రం లభించడం పట్ల కూలీ స్వామిదిన్ పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటామని చెప్పారు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు.

'వేలంలో వజ్రాన్ని ఉంచుతాం'
మరోవైపు, పన్నాలో ఒక్కరోజులోనే చాలా మంది అదృష్టం మారిపోతుందని కలెక్టర్ సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పన్నాలో 16 వజ్రాలు దొరికాయని వెల్లడించారు. స్వామిదిన్​ తన దొరికిన వజ్రం పన్నాలోని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారని తెలిపారు. త్వరలో జరగనున్న వేలంలో దానిని విక్రయానికి ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ వజ్రం ధర రూ.కోటిపైగా ఉంటుందని అంచనా వేశారు.

Diamond Found In Panna
కూలీకి దొరికిన భారీ 'డైమండ్​' (ETV Bharat)

వజ్రాలకు పన్నా ప్రసిద్ధి
పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు చెప్పారు.

Diamond Found In Panna : భారత్​లోనే కాదు ఖండాల్లోనూ విలువైన వజ్రాలకు ప్రఖ్యాతి గాంచిన మధ్యప్రదేశ్​లోని పన్నాలో మరో విలువైన వజ్రం బయటపడింది. స్వామిదిన్ పాల్ అనే కూలీ మరో ముగ్గురితో కలిసి 2024 మేలో సర్కోహా గ్రామంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ స్వామిదిన్​కు గురువారం 32.80 క్యారెట్ల వజ్రం దొరికింది. ఈ భారీ వజ్రం విలువ రూ.1.5 కోట్లు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో స్వామిదిన్ పాల్ రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిపోయాడు.

'పిల్లలకు ఇళ్లు కట్టిస్తాం'
పన్నా జిల్లాలోని నారంగి బాగ్​కు చెందిన స్వామిదిన్ పాల్ ఈ వజ్రాన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాడు. భారీ వజ్రం లభించడం పట్ల కూలీ స్వామిదిన్ పాల్ సంతోషం వ్యక్తం చేశాడు. నలుగురు భాగస్వాములం డైమండ్ వేలంలో వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుంటామని చెప్పారు. ఈ వజ్రం ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు.

'వేలంలో వజ్రాన్ని ఉంచుతాం'
మరోవైపు, పన్నాలో ఒక్కరోజులోనే చాలా మంది అదృష్టం మారిపోతుందని కలెక్టర్ సురేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పన్నాలో 16 వజ్రాలు దొరికాయని వెల్లడించారు. స్వామిదిన్​ తన దొరికిన వజ్రం పన్నాలోని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశారని తెలిపారు. త్వరలో జరగనున్న వేలంలో దానిని విక్రయానికి ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ వజ్రం ధర రూ.కోటిపైగా ఉంటుందని అంచనా వేశారు.

Diamond Found In Panna
కూలీకి దొరికిన భారీ 'డైమండ్​' (ETV Bharat)

వజ్రాలకు పన్నా ప్రసిద్ధి
పన్నా ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి. అనేక మంది ఆ ప్రాంతంలో భూమిని లీజుకు తీసుకుని, ప్రభుత్వ అనుమతితో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుంటారు. గనుల్లో దొరికిన వజ్రాల్ని డైమండ్ ఆఫీస్​లో డిపాజిట్ చేసి, అధికారుల సమక్షంలో వేలం వేయిస్తారు. అయితే ఆ ప్రాంతంలో ఎవరికైనా తమ పొలాల్లో ఏదైనా విలువైన వజ్రం లేదా రాయి దొరికితే ప్రభుత్వం వాటి విలువలో 12.5 శాతం వాటా ఇస్తుంది. కానీ కొంత మంది తమకు గనుల్లో దొరికిందని, ఆ వస్తువు తమదే అని వాదిస్తారు. ఒక వేళ ఈ విషయం కోర్టుకు వెళ్తే తీర్పు గని యజమానికి అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఒక వేళ డైమండ్​ దొరికిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా దాచితే వారిపై చర్యలు​ తీసుకోవచ్చని పోలీసులు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.