ETV Bharat / bharat

రూ.2వేల నోటుపై ప్రధాని మోదీ ఫొటో​- ఎన్నికల ఫలితాల వేళ స్పెషల్​ ప్రింట్- వారికి బహుమతిగా! - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 1:57 PM IST

Modi Photo On 2000rs Silver Note : మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ లోక్​సభ ఎన్నికల విజేత మెజార్టీని అంచనా వేసిన వారికి ప్రధాని మోదీ ఫొటోతో కూడిన రూ.2వేల వెండి నోటును బహుమతిగా అందించనున్నట్లు ఓ బంగారు వ్యాపారి ప్రకటించారు. 51మంది విజేతలకు ఈ గిఫ్ట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ అభిమానంతో ఓటింగ్​ పెంచేందుకే ఇలా చేశానని చెబుతున్నారు.

Modi Photo On 2000rs Silver Note
Modi Photo On 2000rs Silver Note (ETV Bharat)
రూ.2వేల నోటుపై ప్రధాని మోదీ ఫొటో​- ఎన్నికల ఫలితాల వేళ స్పెషల్​ ప్రింట్- వారికి బహుమతిగా! (ETV Bharat)

Modi Photo On 2000rs Silver Note : మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ, ఇతర అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇందౌర్​కు చెందిన ఓ బంగారం వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. ఇందౌర్​లో విజేత ఎవరు, మెజార్టీని అంచనా వేసిన వారికి మోదీ ఫొటోతో కూడిన రూ.2వేల వెండి నోటును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 51 మంది విజేతలకు ఈ బహుమతిని ఇవ్వనున్నట్లు చెప్పారు.

Modi Photo On 2000rs Silver Note
రూ.2వేల వెండినోటుపై ముద్రించిన ప్రధాని మోదీ చిత్రం (ETV Bharat)

ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని
ఇందౌర్​కు చెందిన నిర్మల్ వర్మ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఇందౌర్​లో లోక్​సభ ఎన్నికల్లో విజేత సాధించే మెజార్టీ చెప్పిన 51మందికి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ఉన్న వెండి నోటును అందించనున్నట్లు చెప్పారు నిర్మల్ వర్మ. ప్రధాని మోదీ వెండి విగ్రహాలే కాకుండా ఆయనకు సంబంధించిన పలు రకాల చిహ్నాలను తయారు చేశారు.

'ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే'
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు(జూన్ 4) 51మంది విజేతలకు ఇందౌర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ బహుమతులను అందిస్తారు. ఈ పోటీని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, యువత మరింత ఎక్కువగా ఓటు వేసేలా ఉత్సాహాన్ని నింపేందుకు నిర్వహిస్తున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్ శర్మ తెలిపారు. జూన్ 4న బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ లక్కీ డ్రా తెరిచి 51మంది విజేతలను ప్రకటిస్తారని, ఆయనే విజేతలకు బహుమతులు అందిస్తారని పేర్కొన్నారు.

Modi Photo On 2000rs Silver Note
నిర్మల్ వర్మ, బంగారు వ్యాపారి (ETV Bharat)

వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు
ప్రస్తుతం ఇందౌర్ లోక్ సభ ఎన్నికల్లో విజేత మెజార్టీ అంచనా వేసే పోటీకి వందలాది రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 3 వరకు (అంటే ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు వరకు) కొనసాగుతుందని వర్మ అన్నారు. "పోటీలో వేలాది మంది పాల్గొంటారు. ఇక్కడ పోటీలో ఉన్న విజేత 9-13 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించినున్నట్లు చెబుతున్నారు. 9-13 లక్షల మధ్య ఐదు నంబర్లు ఇస్తాం. అందులో ఒక నంబరును చెప్పాలి. అలా 51 మంది విజేతలనకు ప్రకటిస్తాం. ఈ పోటీలో పాల్గొనేవారి పేర్లు, మొబైల్ నంబరును రాసుకుంటున్నాను. వారు గెలిస్తే బహుమతులు ఇస్తా." అని నిర్మల్ వర్మ తెలిపారు.

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach

'గోల్డ్​ స్మగ్లింగ్​తో నాకేం సంబంధం లేదు'- మాజీ పీఏ అరెస్టుపై శశిథరూర్​ రియాక్షన్! - Shashi Tharoor PA Arrest

రూ.2వేల నోటుపై ప్రధాని మోదీ ఫొటో​- ఎన్నికల ఫలితాల వేళ స్పెషల్​ ప్రింట్- వారికి బహుమతిగా! (ETV Bharat)

Modi Photo On 2000rs Silver Note : మధ్యప్రదేశ్​లోని ఇందౌర్ లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ, ఇతర అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇందౌర్​కు చెందిన ఓ బంగారం వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. ఇందౌర్​లో విజేత ఎవరు, మెజార్టీని అంచనా వేసిన వారికి మోదీ ఫొటోతో కూడిన రూ.2వేల వెండి నోటును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 51 మంది విజేతలకు ఈ బహుమతిని ఇవ్వనున్నట్లు చెప్పారు.

Modi Photo On 2000rs Silver Note
రూ.2వేల వెండినోటుపై ముద్రించిన ప్రధాని మోదీ చిత్రం (ETV Bharat)

ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని
ఇందౌర్​కు చెందిన నిర్మల్ వర్మ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఇందౌర్​లో లోక్​సభ ఎన్నికల్లో విజేత సాధించే మెజార్టీ చెప్పిన 51మందికి జాతిపిత మహాత్మా గాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో ఉన్న వెండి నోటును అందించనున్నట్లు చెప్పారు నిర్మల్ వర్మ. ప్రధాని మోదీ వెండి విగ్రహాలే కాకుండా ఆయనకు సంబంధించిన పలు రకాల చిహ్నాలను తయారు చేశారు.

'ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే'
ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు(జూన్ 4) 51మంది విజేతలకు ఇందౌర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ బహుమతులను అందిస్తారు. ఈ పోటీని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, యువత మరింత ఎక్కువగా ఓటు వేసేలా ఉత్సాహాన్ని నింపేందుకు నిర్వహిస్తున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్ శర్మ తెలిపారు. జూన్ 4న బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ లక్కీ డ్రా తెరిచి 51మంది విజేతలను ప్రకటిస్తారని, ఆయనే విజేతలకు బహుమతులు అందిస్తారని పేర్కొన్నారు.

Modi Photo On 2000rs Silver Note
నిర్మల్ వర్మ, బంగారు వ్యాపారి (ETV Bharat)

వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు
ప్రస్తుతం ఇందౌర్ లోక్ సభ ఎన్నికల్లో విజేత మెజార్టీ అంచనా వేసే పోటీకి వందలాది రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 3 వరకు (అంటే ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు వరకు) కొనసాగుతుందని వర్మ అన్నారు. "పోటీలో వేలాది మంది పాల్గొంటారు. ఇక్కడ పోటీలో ఉన్న విజేత 9-13 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించినున్నట్లు చెబుతున్నారు. 9-13 లక్షల మధ్య ఐదు నంబర్లు ఇస్తాం. అందులో ఒక నంబరును చెప్పాలి. అలా 51 మంది విజేతలనకు ప్రకటిస్తాం. ఈ పోటీలో పాల్గొనేవారి పేర్లు, మొబైల్ నంబరును రాసుకుంటున్నాను. వారు గెలిస్తే బహుమతులు ఇస్తా." అని నిర్మల్ వర్మ తెలిపారు.

మహిళ కడుపులో 2.5కిలోల వెంట్రుకలు- సర్జరీ ద్వారా తొలగింపు- ప్రెగ్నెన్సీ టైంలో అలా చేసినందుకే! - Hair In Woman Stomach

'గోల్డ్​ స్మగ్లింగ్​తో నాకేం సంబంధం లేదు'- మాజీ పీఏ అరెస్టుపై శశిథరూర్​ రియాక్షన్! - Shashi Tharoor PA Arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.