ETV Bharat / bharat

'రీక్లెయిమ్​ ది నైట్'- అర్ధరాత్రి అట్టుడుకిన బంగాల్​- వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలో విధ్వంసం! - Kolkata Doctor Case

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 7:42 AM IST

Kolkata Doctor Case Protest : కోల్‌కతా ఆర్​జీ కర్ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌ హత్యచార ఘటనకు నిరసనగా బంగాల్​వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి వేలాది మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు డాక్టర్లు ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు.

Kolkata Doctor Case Protest
Kolkata Doctor Case Protest (ETV Bharat)

Kolkata Doctor Case Protest : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా గురువారం అర్ధరాత్రి బంగాల్​వ్యాప్తంగా వేలాది మహిళలు 'రీ క్లెయిమ్​ ది నైట్​' పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సెల్​ఫోన్​ లైట్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కొందరు దుండగులు ట్రైనీ డాక్టర్​పై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడి సామాగ్రిని నాశనం చేశారు.

'రీ క్లెయిమ్​ ది నైట్'​ పేరుతో ర్యాలీ
బంగాల్​లోని దుర్గాపూర్​లో స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో మహిళలు అర్ధరాత్రి వేళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సెల్​ఫోన్ లైట్లు వేసి నిరసన ర్యాలీ చేశారు. ​తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇది మరో కొత్త స్వాతంత్ర్య పోరాటం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్​కతా సహా పలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఆస్పత్రి సామాగ్రి ధ్వంసం
కోల్‌కతా ఆర్​జీ కర్‌ ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళలు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. సుమారు 40 మంది ఆస్పత్రికి సంబంధించి ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు వివరించారు. అక్కడ భద్రతగా ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి దుండగులను చెదరగొట్టారు. దుండగులు అక్కడే ఉన్న పోలీసు వాహనంతోపాటు కొన్ని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ రెండు గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. దాడులకు పాల్పడిన వారు ఏ పార్టీవారైనా సరే 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పోలీసు కమిషనర్‌ను కోరారు.

'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case

వైద్యురాలి హత్య జరిగితే - ఆత్మహత్య అంటూ ఆసుపత్రి నుంచి ఫోన్‌ చేశారు - ఎందుకు? - KOLKATA DOCTOR RAPE CASE UPDATES

Kolkata Doctor Case Protest : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా గురువారం అర్ధరాత్రి బంగాల్​వ్యాప్తంగా వేలాది మహిళలు 'రీ క్లెయిమ్​ ది నైట్​' పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సెల్​ఫోన్​ లైట్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మరోవైపు కొందరు దుండగులు ట్రైనీ డాక్టర్​పై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడి సామాగ్రిని నాశనం చేశారు.

'రీ క్లెయిమ్​ ది నైట్'​ పేరుతో ర్యాలీ
బంగాల్​లోని దుర్గాపూర్​లో స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్న 'రీ క్లెయిమ్ ది నైట్' పేరుతో మహిళలు అర్ధరాత్రి వేళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సెల్​ఫోన్ లైట్లు వేసి నిరసన ర్యాలీ చేశారు. ​తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇది మరో కొత్త స్వాతంత్ర్య పోరాటం అనే ప్లకార్డులను ప్రదర్శించారు. వైద్యురాలిపై హత్యాచారం చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్​కతా సహా పలు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ఆస్పత్రి సామాగ్రి ధ్వంసం
కోల్‌కతా ఆర్​జీ కర్‌ ప్రభుత్వాసుపత్రి వద్ద మహిళలు ధర్నా నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. సుమారు 40 మంది ఆస్పత్రికి సంబంధించి ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు వివరించారు. అక్కడ భద్రతగా ఉన్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి దుండగులను చెదరగొట్టారు. దుండగులు అక్కడే ఉన్న పోలీసు వాహనంతోపాటు కొన్ని ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ రెండు గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. దాడులకు పాల్పడిన వారు ఏ పార్టీవారైనా సరే 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోవాలని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పోలీసు కమిషనర్‌ను కోరారు.

'ఆమె' బాడీలో 150మిల్లీ గ్రాముల వీర్యం! వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందా? - Kolkata Doctor Case

వైద్యురాలి హత్య జరిగితే - ఆత్మహత్య అంటూ ఆసుపత్రి నుంచి ఫోన్‌ చేశారు - ఎందుకు? - KOLKATA DOCTOR RAPE CASE UPDATES

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.