ETV Bharat / bharat

దోశలు క్రిస్పీగా రావడం లేదా? - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే హోటల్​ స్టైల్​ గ్యారెంటీ! - How to Make Hotel Style Crispy Dosa

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 12:04 PM IST

Crispy Dosa Making Tips: మీకు దోశలు అంటే ఇష్టమా? ఇంట్లో ఎన్ని సార్లు చేసినా హోటల్​ స్టైల్​ క్రిస్పీ దోశలు రావడం లేదా? అయితే నో టెన్షన్​. ఈ సారి ఇంట్లో వేసే దోశలు క్రిస్పీగా రావాలంటే ఈ టిప్స్​ పాటిస్తూ చేయండి.. అద్దిరిపోతాయి.

Crispy Dosa Making Tips
How to Make Hotel Style Crispy Dosa At Home (Etv Bharat)

How to Make Hotel Style Crispy Dosa At Home: సౌత్​ ఇండియన్స్​.. ఫేవరెట్​ టిఫెన్స్​​ అంటే దోశ ముందు ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దోశలో రకాలు చూస్తే అబ్బో చాలానే ఉంటాయి. ప్లెయిన్​ దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్​ దోశ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వేటికవే స్పెషల్​ టేస్ట్​తో ఊరిస్తాయి. అయితే దోశలను ఇంట్లో చేసుకుంటే.. హోటళ్లో చేసేంత క్రిస్పీగా రావు. కాబట్టి క్రిస్పీగా రావాలంటే పిండి దగ్గర నుంచి దోశ వేసే వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి పిండి పర్ఫెక్ట్​గా ఉందా.. ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. అందుకు దోశపిండిని ఎలా తయారు చేసుకోవాలి..? మినప పప్పు, బియ్యం పిండి ఎంత నిష్పత్తిలో ఉండాలి? తదితర విషయాలు తెలుసుకుందాం..

దోశ పిండి తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు:

  • మినప గుండ్లు - ఒక కప్పు(125 గ్రాములు)
  • బియ్యం - 4 కప్పులు(అర కేజీ)
  • మెంతులు - ఒక టేబుల్​ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • అన్నం- అర కప్పు

పిండి తయారు చేసుకునే విధానం

  • ముందుగా ఓ గిన్నెలో బియ్యం, పచ్చి శనగపప్పు శుభ్రంగా కడిగి సుమారు 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ సన్న బియ్యం బదులు రేషన్​ బియ్యం వాడుకుంటే దోశల టేస్ట్​ బాగుంటుంది.
  • మరోగిన్నె తీసుకుని మినపప్పు, మెంతులు వేసి వాటిని శుభ్రంగా కడిని 6 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం, మినపప్పు ఎంత నానితే అంత బాగుంటాయి దోశలు.
  • బియ్యం, మినప్పప్పు నానిన తర్వాత అందులోని నీరు ఒంపి రెండింటిని కలిపి ఒకే గిన్నెలో కలుపుకుని ప్రెష్​ వాటర్​ పోసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​ తీసుకుని కొద్దిగా బియ్యం మిశ్రమాన్ని తీసుకుంటూ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిండిని మరీ జోరుగా పట్టుకోవద్దు. కొంచెం గట్టిగానే పిండి పట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్​ చేసిన మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బియ్యం, మినపప్పు మిశ్రమాన్ని మొత్తం కలిపి గ్రైండ్​ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో అన్నం తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకుని దోశ పిండిలో కలుపుకోవాలి.
  • ఇప్పుడు పిండినంతా ఒకసారి బాగా కలుపుకుని పక్కకు పెట్టాలి.
  • ఉదయం టిఫెన్​లోకి పిండి కావాలనుకున్నవారు రాత్రి సిద్ధం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకునే దోశలు కన్నా.. పిండి కాస్త పులిసిన తర్వాత చేసుకునే దోశలు టేస్టీగా ఉంటాయి. కాబట్టి రాత్రంతా పిండి నానితే ఉదయానికి పిండి పులుస్తుంది.

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

దోశ వేసుకునే విధానం:

  • ఇప్పుడు పులిసిన దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అందులో కొత్త భాగాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశలు వేయడానికి ఏ విధంగా కావాలో అలా రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద దోశ పెనం పెట్టి.. పాన్​ కాస్త హీట్​ అయ్యాక ఉల్లిపాయను సగానికి కట్​ చేసి పెనంపై రుద్దాలి.
  • ఆ తర్వాత దోశ పిండి పోసి సమానంగా, గుండ్రంగా స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • ఓ నిమిషం తర్వాత కొద్దిగా నూనె అప్లై చేసి ఎర్రగా కాలిన తర్వాత.. మరోవైపు ఓ అర నిమిషం పాటు కాల్చుకుంటే టేస్టీ అండ్​ క్రిస్పీ దోశ రెడీ.
  • ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు పోసుకున్నాక.. పిండి మిగిలితే దానిని బాక్స్​లోకి తీసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే మరుసటి రోజుకు కూడా అద్దిరిపోతాయి.
  • ఈ పిండితో కేవలం ప్లెయిన్​ దోశ మాత్రమే కాదండోయ్​.. ఆనియన్​, కారం, మసాలా, ఎగ్​ దోశ.. ఇలా ఏదైనా రెడీ చేసుకోవచ్చు.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

How to Make Hotel Style Crispy Dosa At Home: సౌత్​ ఇండియన్స్​.. ఫేవరెట్​ టిఫెన్స్​​ అంటే దోశ ముందు ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. దోశలో రకాలు చూస్తే అబ్బో చాలానే ఉంటాయి. ప్లెయిన్​ దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్​ దోశ.. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వేటికవే స్పెషల్​ టేస్ట్​తో ఊరిస్తాయి. అయితే దోశలను ఇంట్లో చేసుకుంటే.. హోటళ్లో చేసేంత క్రిస్పీగా రావు. కాబట్టి క్రిస్పీగా రావాలంటే పిండి దగ్గర నుంచి దోశ వేసే వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఒక్కసారి పిండి పర్ఫెక్ట్​గా ఉందా.. ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు. అందుకు దోశపిండిని ఎలా తయారు చేసుకోవాలి..? మినప పప్పు, బియ్యం పిండి ఎంత నిష్పత్తిలో ఉండాలి? తదితర విషయాలు తెలుసుకుందాం..

దోశ పిండి తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు:

  • మినప గుండ్లు - ఒక కప్పు(125 గ్రాములు)
  • బియ్యం - 4 కప్పులు(అర కేజీ)
  • మెంతులు - ఒక టేబుల్​ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • అన్నం- అర కప్పు

పిండి తయారు చేసుకునే విధానం

  • ముందుగా ఓ గిన్నెలో బియ్యం, పచ్చి శనగపప్పు శుభ్రంగా కడిగి సుమారు 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ సన్న బియ్యం బదులు రేషన్​ బియ్యం వాడుకుంటే దోశల టేస్ట్​ బాగుంటుంది.
  • మరోగిన్నె తీసుకుని మినపప్పు, మెంతులు వేసి వాటిని శుభ్రంగా కడిని 6 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం, మినపప్పు ఎంత నానితే అంత బాగుంటాయి దోశలు.
  • బియ్యం, మినప్పప్పు నానిన తర్వాత అందులోని నీరు ఒంపి రెండింటిని కలిపి ఒకే గిన్నెలో కలుపుకుని ప్రెష్​ వాటర్​ పోసుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​ తీసుకుని కొద్దిగా బియ్యం మిశ్రమాన్ని తీసుకుంటూ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పిండిని మరీ జోరుగా పట్టుకోవద్దు. కొంచెం గట్టిగానే పిండి పట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్​ చేసిన మిశ్రమాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బియ్యం, మినపప్పు మిశ్రమాన్ని మొత్తం కలిపి గ్రైండ్​ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో అన్నం తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకుని దోశ పిండిలో కలుపుకోవాలి.
  • ఇప్పుడు పిండినంతా ఒకసారి బాగా కలుపుకుని పక్కకు పెట్టాలి.
  • ఉదయం టిఫెన్​లోకి పిండి కావాలనుకున్నవారు రాత్రి సిద్ధం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకునే దోశలు కన్నా.. పిండి కాస్త పులిసిన తర్వాత చేసుకునే దోశలు టేస్టీగా ఉంటాయి. కాబట్టి రాత్రంతా పిండి నానితే ఉదయానికి పిండి పులుస్తుంది.

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

దోశ వేసుకునే విధానం:

  • ఇప్పుడు పులిసిన దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అందులో కొత్త భాగాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసుకుంటూ దోశలు వేయడానికి ఏ విధంగా కావాలో అలా రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద దోశ పెనం పెట్టి.. పాన్​ కాస్త హీట్​ అయ్యాక ఉల్లిపాయను సగానికి కట్​ చేసి పెనంపై రుద్దాలి.
  • ఆ తర్వాత దోశ పిండి పోసి సమానంగా, గుండ్రంగా స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • ఓ నిమిషం తర్వాత కొద్దిగా నూనె అప్లై చేసి ఎర్రగా కాలిన తర్వాత.. మరోవైపు ఓ అర నిమిషం పాటు కాల్చుకుంటే టేస్టీ అండ్​ క్రిస్పీ దోశ రెడీ.
  • ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు పోసుకున్నాక.. పిండి మిగిలితే దానిని బాక్స్​లోకి తీసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే మరుసటి రోజుకు కూడా అద్దిరిపోతాయి.
  • ఈ పిండితో కేవలం ప్లెయిన్​ దోశ మాత్రమే కాదండోయ్​.. ఆనియన్​, కారం, మసాలా, ఎగ్​ దోశ.. ఇలా ఏదైనా రెడీ చేసుకోవచ్చు.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.