ETV Bharat / bharat

నెల రోజుల్లో రూ.4,650 కోట్లు జప్తు- ఎన్నికల్లో ఎటుచూసినా డబ్బు, మద్యం- 75 ఏళ్ల రికార్డ్ బ్రేక్ - EC Seized Money Lok Sabha Polls

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 2:22 PM IST

EC Seized Money Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో పెద్ద ఎత్తున నగదు, మద్యం, ఓటర్లకు పంచే తాయిలాలను పోలీసులు, దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు 100 కోట్ల రూపాయల విలువైన జప్తులు జరుగుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా పోలింగ్‌ మొదలుకాకుండానే ఇప్పటికే రూ.4,650 కోట్లు జప్తు చేసినట్లు తెలిపింది.

EC Seized Money Lok Sabha Polls
EC Seized Money Lok Sabha Polls

EC Seized Money Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో జప్తులు ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా పోలింగ్‌ మొదలుకాకుండానే ఇప్పటివరకు రూ. 4,650 కోట్లను జప్తు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఏడు విడతల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికు చేరుతాయో అంచనాలకు అందని విధంగా ఉన్నాయని ఈసీ తెలిపింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తులను ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వందల సంఖ్యలో కేసులు నమోదు
పోలింగ్‌ తేదీలు సమీపించే కొద్దీ ఈ నగదు ప్రవాహం మరింత ఎక్కువ కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు ఎన్నికల్లో నగదు ప్రవాహంపై దృష్టిపెట్టారు. ఏ స్థాయి నేతలైనా అధికారులు వారి కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన కానుకలను దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు పలు చోట్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ జప్తులకు సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ముర్షిదాబాద్​ డీఐజీ తొలగింపు
మరోవైపు బంగాల్​లోని ముర్షిదాబాద్‌ డీఐజీని తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు తక్షణమే నిరోధించడానికి చర్యలు తీసుకోలేదని, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. రెండు హింస్మాతక ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించనుట్లు తెలసిందని ఈసీ పేర్కొంది.

'తీర్పులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు, కోర్టులపై తీవ్ర ఒత్తిడి'- సీజేఐకి లేఖలో మాజీ జడ్జిల ఆందోళన - Retired Judges Letter to CJI

ఇక దేశంలో ఉల్లి కొరత ఉండదు! అన్ని సీజన్లలో సాగు చేసేలా 93కొత్త వంగడాల ఆవిష్కరణ - 93 varieties of onion

EC Seized Money Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో జప్తులు ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా పోలింగ్‌ మొదలుకాకుండానే ఇప్పటివరకు రూ. 4,650 కోట్లను జప్తు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఏడు విడతల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికు చేరుతాయో అంచనాలకు అందని విధంగా ఉన్నాయని ఈసీ తెలిపింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తులను ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వందల సంఖ్యలో కేసులు నమోదు
పోలింగ్‌ తేదీలు సమీపించే కొద్దీ ఈ నగదు ప్రవాహం మరింత ఎక్కువ కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు ఎన్నికల్లో నగదు ప్రవాహంపై దృష్టిపెట్టారు. ఏ స్థాయి నేతలైనా అధికారులు వారి కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన కానుకలను దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు పలు చోట్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ జప్తులకు సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ముర్షిదాబాద్​ డీఐజీ తొలగింపు
మరోవైపు బంగాల్​లోని ముర్షిదాబాద్‌ డీఐజీని తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు తక్షణమే నిరోధించడానికి చర్యలు తీసుకోలేదని, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. రెండు హింస్మాతక ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించనుట్లు తెలసిందని ఈసీ పేర్కొంది.

'తీర్పులను వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు, కోర్టులపై తీవ్ర ఒత్తిడి'- సీజేఐకి లేఖలో మాజీ జడ్జిల ఆందోళన - Retired Judges Letter to CJI

ఇక దేశంలో ఉల్లి కొరత ఉండదు! అన్ని సీజన్లలో సాగు చేసేలా 93కొత్త వంగడాల ఆవిష్కరణ - 93 varieties of onion

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.