Bengaluru Building Collapsed : బెంగళూరులో నిర్మాణ దశలో ఉన్న ఓ ఏడు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 14 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇంకా శిథిలాల కింద ఐదుగురు వ్యక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, బెంగళూరులో నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం మంగళవారం కుప్పకూలింది. దీంతో భవనం కింద దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. తూర్పు బెంగళూరులోని బాబుసపల్య వద్ద సాయంత్రం 4.10 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ, అగ్నిమాపక, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.