ETV Bharat / bharat

అరుణాచల దర్శనానికి ప్లాన్ చేస్తున్నారా? - స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన తెలంగాణ టూరిజం! - Arunachalam Tour Package

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 4:10 PM IST

Arunachalam Tour Package : వేసవిలో అరుణాచలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో తెలంగాణ టూరిజం శాఖ.. సూపర్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. రోడ్డు మార్గం ద్వారా 4 రోజులపాటు సాగే ఈ పర్యటనలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఇంతకీ.. ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంది? ధర ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Arunachalam Tour
Arunachalam Tour Package

Hyderabad to Arunachalam Tour Package : సమ్మర్​లో విద్యార్థుల స్కూల్స్​ ముగిసిన తర్వాత.. అందరూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి, ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. మరి.. మీరు కూడా ఇలాంటి టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఆ దర్శనీయ ప్రాంతాల్లో అరుణాచల పుణ్యక్షేత్రానికీ చోటివ్వండి. అరుణాచల గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ పర్యటన హైదరాబాద్​ నుంచి అరుణాచలం(Arunachalam) వరకు రోడ్డు మార్గం ద్వారా 4 రోజుల పాటు సాగుతుంది. మరి.. ఈ టూర్ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? వంటి ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పౌర్ణమిని పురస్కరించుకొని.. తెలంగాణ టూరిజం శాఖ అరుణాచలం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ నాడు, జూన్​లో 19వ తేదీ రోజు అందుబాటులో ఉండనుంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ పర్యటనలో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయని తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది.

హైదరాబాద్ - అరుణాచలం పర్యటన కొనసాగనుందిలా..

  • మొదటి రోజు ఈ టూర్ హైదారాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు స్టార్ట్ అవుతుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం రీచ్ అవుతారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అనంతరం.. అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. అనంతరం శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగో రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. ఏసీ బస్సుల్లో ప్రయాణం సాగే ఈ టూర్​లో టికెట్ ధర పెద్దలకు రూ.7,500, పిల్లలకు రూ.6,000గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయని, దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ టూరిజం శాఖ పేర్కొంది.
  • ఇక ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్​ను సంప్రదించవచ్చని తెలిపింది.

కోరిన కోర్కెలు తీర్చే 'బెల్లం గణపతి'! స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన గణేశుడు ఎక్కడున్నాడో తెలుసా?

తల్లిదండ్రులకు గుడి కట్టి పూజలు చేస్తున్న కుమారులు - ఎక్కడంటే?

Hyderabad to Arunachalam Tour Package : సమ్మర్​లో విద్యార్థుల స్కూల్స్​ ముగిసిన తర్వాత.. అందరూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి, ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. మరి.. మీరు కూడా ఇలాంటి టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఆ దర్శనీయ ప్రాంతాల్లో అరుణాచల పుణ్యక్షేత్రానికీ చోటివ్వండి. అరుణాచల గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ పర్యటన హైదరాబాద్​ నుంచి అరుణాచలం(Arunachalam) వరకు రోడ్డు మార్గం ద్వారా 4 రోజుల పాటు సాగుతుంది. మరి.. ఈ టూర్ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? వంటి ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పౌర్ణమిని పురస్కరించుకొని.. తెలంగాణ టూరిజం శాఖ అరుణాచలం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ నాడు, జూన్​లో 19వ తేదీ రోజు అందుబాటులో ఉండనుంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ పర్యటనలో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయని తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది.

హైదరాబాద్ - అరుణాచలం పర్యటన కొనసాగనుందిలా..

  • మొదటి రోజు ఈ టూర్ హైదారాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు స్టార్ట్ అవుతుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం రీచ్ అవుతారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
  • మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అనంతరం.. అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడో రోజు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. అనంతరం శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగో రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే.. ఏసీ బస్సుల్లో ప్రయాణం సాగే ఈ టూర్​లో టికెట్ ధర పెద్దలకు రూ.7,500, పిల్లలకు రూ.6,000గా నిర్ణయించారు.
  • టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయని, దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ టూరిజం శాఖ పేర్కొంది.
  • ఇక ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్​ను సంప్రదించవచ్చని తెలిపింది.

కోరిన కోర్కెలు తీర్చే 'బెల్లం గణపతి'! స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన గణేశుడు ఎక్కడున్నాడో తెలుసా?

తల్లిదండ్రులకు గుడి కట్టి పూజలు చేస్తున్న కుమారులు - ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.