ETV Bharat / bharat

పండుగ పూట విషాదం - ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తండ్రి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో విషాదం - ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తండ్రి ఆత్మహత్య - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Man throws 2 kids Into well
Man throws 2 kids Into well (ETV Bharat)

Man throws 2 kids Into well : కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొలుత బావిలో ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొంత సేపటి తర్వాత ఆ ఇద్దరి పిల్లల తండ్రి మృతదేహాన్ని కూడా గజ ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. ఈ ఉదంతం శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి : నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస రెడ్డికి ఇద్దరు పిల్లలు. దసరా పండుగ సందర్భంగా తండ్రితో కలిసి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. ఇద్దరు పిల్లలు ఓ వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

కుటుంబ కలహాలే కారణమా? : బావి వద్ద శ్రీనివాస్ రెడ్డి సెల్​ఫోన్​తో పాటు చేతి గడియారం, చెప్పులను గుర్తించారు. అతడి డెడ్​ బాడీ కోసం బావిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని బావిలో గుర్తించారు. నందివాడకు ఇళ్లరికం వచ్చినట్టు తెలిసింది. తండ్రే తన పిల్లలను బావిలో తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి మృతికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరుకుని, కుటుంబ సభ్యులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో నందివాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Man throws 2 kids Into well : కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సహా వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తొలుత బావిలో ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. కొంత సేపటి తర్వాత ఆ ఇద్దరి పిల్లల తండ్రి మృతదేహాన్ని కూడా గజ ఈతగాళ్లు వెతికి బయటకు తీశారు. ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. ఈ ఉదంతం శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి : నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస రెడ్డికి ఇద్దరు పిల్లలు. దసరా పండుగ సందర్భంగా తండ్రితో కలిసి బయటకు వెళ్లారు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. ఇద్దరు పిల్లలు ఓ వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

కుటుంబ కలహాలే కారణమా? : బావి వద్ద శ్రీనివాస్ రెడ్డి సెల్​ఫోన్​తో పాటు చేతి గడియారం, చెప్పులను గుర్తించారు. అతడి డెడ్​ బాడీ కోసం బావిలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని బావిలో గుర్తించారు. నందివాడకు ఇళ్లరికం వచ్చినట్టు తెలిసింది. తండ్రే తన పిల్లలను బావిలో తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి మృతికి కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరుకుని, కుటుంబ సభ్యులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో నందివాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రూ.10 కోట్ల సాయం అందినా దక్కని చిన్నారి ప్రాణం - మరో రూ.6 కోట్లు తక్కువ పడటంతోనే! - Six Months Baby Died Fatal Disease

'నా మనవడిని నా చేతులతోనే చంపుకున్నాను - దేవుడా ఎందుకిలా చేశావు' - Peddapalli Tractor Accident boy died

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.