తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని అనుమానాస్పద మృతిని పోలీసులు ఛేదించారు. మృతుని భార్య, ఆమె ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

By

Published : Dec 14, 2019, 8:09 PM IST

murder-in-yadadri-bhuvanagiri
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటపురం గ్రామంలో వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మూటకొండురు మండల కేంద్రానికి చెందిన నరేశ్​కు, దూది వెంకటపురానికి చెందిన భాగ్యలక్ష్మిలకు గత 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. యాదగిరి గుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ఐలయ్యతో భాగ్యలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని భర్త నరేశ్​కు తెలియడంతో... భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీనితో భాగ్యలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. నరేశ్ తన భార్య పిల్లలను తీసుకురావడనికి మద్యం సేవించి అత్తగారింటికి వెళ్లాడు. అదే అదనుగా భావించి భాగ్యలక్ష్మి ప్రియుడితో కలిసి దిండుతో భర్తకు ఊపిరాడకుండా చేసి ఆ తరువాత కిరోసిన్ పోసి నిప్పటించి ఆత్మహత్యగా చిత్రీకరించింది. మృతుని తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను రిమాండ్ తరలించారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ఇదీ చూడండి: వసతి గృహంలో యువకుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details