తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి నుంచి అదృశ్యమై మరణించిన వృద్ధుడు

ఇంటి నుంచి తప్పిపోయిన ఓ వయోవృద్ధుడు మృత్యవాత పడ్డాడు. కాజీపేట విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ అనే వృద్ధుడు ఈ నెల 14న తప్పిపోయాడు. కుమారుల ఫిర్యాదుతో వెతికిన పోలీసులకు సోమవారం నాడు వరంగల్​ అర్బన్​ జిల్లా మడికొండ గ్రీన్​సిటీ వెంచర్​లో కుళ్లిన మృతదేహం కనబడింది. ఆ మృతదేహం రావుల రాంనారాయణదిగా మృతుడి బంధువులు తెలిపారు.

By

Published : Jun 25, 2019, 8:36 AM IST

మరణించిన వయోవృద్ధుడు

ఇంటి నుంచి అదృశ్యమై మరణించిన వయోవృద్ధుడు
వృద్ధాప్యం, మతి పరుపు కారణంగా ఇంటి నుంచి తప్పిపోయి వయోవృద్ధుడు మృత్యువాత పడిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో చోటుచేసుకుంది. కాజీపేట విష్ణుపురికి చెందిన రావుల రాంనారాయణ భార్య చనిపోగా అక్కడే కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈ నెల 14న ఆ వృద్ధుడు ఇంటి నుంచి తప్పిపోగా... కుమారులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మడికొండ గ్రీన్ సిటీ వెంచర్​లోని నిర్మానుష్య ప్రాంతంలో కుళ్ళిన స్థితిలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు మరణించి నాలుగు రోజులకు పైగా అయి ఉంటుందని వారు తెలిపారు. ఆ మృతదేహం తమ తండ్రిదిగా మృతుడి కుమారులు ధ్రువీకరించారు. వయోభారం, ఆకలి, ఎండ వేడిమి లాంటి కారణాలతో వృద్ధుడు చనిపోయి ఉంటాడని కుటుంబీకులు, పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details