తెలంగాణ

telangana

'అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

By

Published : Jan 29, 2021, 5:22 PM IST

సీఎం సహాయ నిధి, కల్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ ఛీఫ్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్ పంపిణీ చేశారు. హన్మకొండలోని రెడ్డికాలనీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కులను అందించారు.

MLA Vinayabhaskar distributed cheques of CM relief Fund and Kalyana Lakshmi at Hanmakonda
'అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ఛీఫ్ విప్, ఎమ్మెల్యే వినయభాస్కర్ అన్నారు. సీఎం సహాయ నిధి, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రెడ్డికాలనీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు అందించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారని కొనియాడారు. పేదల జీవితంలో వెలుగు నింపడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఇదీ చూడండి: 'కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ఉద్యోగుల మీద లేదు'

ABOUT THE AUTHOR

...view details