తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాలలో శ్యాం ప్రసాద్​ ముఖర్జీకి నివాళి అర్పించిన భాజపా

జనసంఘ్​ వ్యవస్థాపకుడు.. భారత దేశమంతా ఒకే రాజ్యాంగం కింద పరిపాలించబడాలని కాంక్షించిన వ్యక్తి శ్యాం ప్రసాద్​ ముఖర్జీ బలిదాన దినం సందర్భంగా పరకాల పట్టణంలో భాజపా నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం మొక్కలు నాటారు.

By

Published : Jun 23, 2020, 12:26 PM IST

Parakala Bjp Leaders Pays Tribute To Shyam Prasad Mukharjee
పరకాలలో శ్యాం ప్రసాద్​ ముఖర్జీకి నివాళి అర్పించిన భాజపా

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పట్టణంలో జనసంఘ్​ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్​ ముఖర్జీ బలిదానం దినోత్సవం సందర్భంగా భాజపా నేతలు నివాళి అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం పట్టణంలోని 52వ బూత్​లో మొక్కలు నాటారు.

భారత దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉండాలని.. కాంక్షించి.. కాశ్మీర్​లో 370 అధికరణ రద్దు కోసం పోరాడి బలిదానమైన డాక్టర్​ శ్యాం ప్రసాద్​ ముఖర్జీ అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్. ఈ కార్యక్రమంలో 22 వ వార్డు కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, పట్టణ ఉపాధ్యక్షులు నాగెల్లి రంజిత్, బూత్ నాయకులు ఎండి సిరాజ్, మేకల ప్రవీణ్, సిద్ధూ, మార్జొడు రంజిత్, యంజాల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details