తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్ల సస్పెన్షన్

విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు తహసీల్దార్లను సూర్యాపేట జిల్లా కలెక్టర్​ సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మేళ్లచెరువు, చింతలపాలెం తహసీల్దార్లు శంకరయ్య, సైదులును సస్పెండ్​ చేశారు.

By

Published : Jul 16, 2019, 11:23 PM IST

తహసీల్దార్లు

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, చింతలపాలెం తహసీల్దార్లను కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని... కొత్త పట్టా పుస్తకాలు ఇవ్వడంలోనిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో పర్యటించారు. ఇద్దరు తహసీల్దార్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం వల్ల పాలనాధికారి వీరిపై వేటు వేశారు.

విధుల్లో నిర్లక్ష్యంతో తహసీల్దార్ల సస్పెన్షన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details