సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషాదం చోటుచేసుకుంది. సిద్ధారెడ్డి(65) పింఛన్ డబ్బుల కోసం హుస్నాబాద్లోని కేడీసీసీ బ్యాంకు వద్దకు రాగా రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఖాతాదారుల వరుసలో నిలబడ్డాడు. ఆకస్మాత్తుగా తల తిరుగుతుందని కింద పడిపోవడం వల్ల అక్కడే ఉన్న కొంతమంది హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆయనను హుస్నాబాద్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు ఆసుపత్రికి తరలించే లోపే సిద్ధారెడ్డి వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బ్యాంక్కు వచ్చిన సిద్ధారెడ్డి హఠాత్తుగా మరణానికి గురికావడం వల్ల కుటుంబసభ్యులు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:భారత్లో 5 కోట్ల మందికి కరోనా ముప్పు!