తెలంగాణ

telangana

By

Published : Jun 25, 2020, 10:45 PM IST

ETV Bharat / state

నిమ్జ్​ తొలి ప్రత్యేక అధికారిణిగా అనురాధ నియామకం

నిమ్జ్​ తొలి ప్రత్యేక అధికారిణిగా అనురాధను టీఎస్​ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి నియమించారు. పటాన్​చెరు టీఎస్ఐఐసీ కార్యాలయంలో డీజెడ్ఎంగా విధులు నిర్వహించడంతో పాటు నిమ్జ్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు.

anuradha appointed as nimz special officer in sangareddy district
నిమ్జ్​ తొలి ప్రత్యేక అధికారిణిగా అనురాధ నియామకం

సంగారెడ్డి జిల్లాలో ఉన్న నేషనల్ ఇన్వెస్ట్​మెంట్​ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్స్(ఎన్​ఐఎంజెడ్​​) తొలి ప్రత్యేక అధికారిణిగా అనురాధను టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి నియమించారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు టీఎస్ఐఐసీ కార్యాలయంలో డీజెడ్ఎంగా విధులు నిర్వహిస్తున్న అనురాధకు జనరల్ మేనేజర్​గా పదోన్నతి లభించింది.

దీంతో టీఎస్ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డి ఆమెను నిమ్జ్ ప్రత్యేక అధికారిణిగా నియమించారు. పటాన్​చెరు టీఎస్ఐఐసీ కార్యాలయంలో డీజెడ్ఎంగా విధులు నిర్వహించడంతో పాటు నిమ్జ్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు. నిమ్జ్ ప్రత్యేక అధికారిగా బాధ్యత తీసుకుంటున్నట్లు అనురాధ చెప్పారు.

ఇవీ చూడండి: 'మెగా ప్లాంటేషన్ డేకు స్పీకర్ పోచారం, మంత్రి కేటీఆర్ హాజరవుతారు'

ABOUT THE AUTHOR

...view details