తెలంగాణ

telangana

నడిరోడ్డుపై కారు దగ్ధం.. ఎగసిపడిన మంటలు

By

Published : Mar 5, 2021, 10:25 PM IST

Updated : Mar 5, 2021, 11:15 PM IST

రంగారెడ్డి జిల్లా అదిభట్ల ఠాణా పరిధిలోని బొంగ్లూర్‌ ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ పొగలు రావడంతో అందులోని వ్యక్తితో పాటు బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నాగోల్‌ నుంచి ఓ వ్యక్తి క్యాబ్‌ బుక్‌ చేసుకుని కొంగరకలాన్‌ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు

దగ్ధమవుతోన్న కారు
దగ్ధమవుతోన్న కారు

నడిరోడ్డుపై కారు దగ్ధం.. ఎగసిపడిన మంటలు

రంగారెడ్డి జిల్లా అదిభట్ల ఠాణా పరిధిలోని బొంగ్లూర్‌ ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ పొగలు రావడంతో అందులోని వ్యక్తితో పాటు బయటకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నాగోల్‌ నుంచి ఓ వ్యక్తి క్యాబ్‌ బుక్‌ చేసుకుని కొంగరకలాన్‌ వైపు వెళుతుండగా కారులో పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కారులో ఉన్న వారిని కిందకి దించేసి.. బానెట్ ఓపెన్ చేయబోతే భారీగా పొగలు వెలువడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్​ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫైర్ ఇంజన్ వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దగ్ధమవుతోన్న కారు
Last Updated : Mar 5, 2021, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details