తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులపై దాడి.. తుపాకీతో ఖైదీ పరార్​

రిమాండ్​లో ఉన్న ఖైదీ పోలీసులపై దాడి చేసి తుపాకీతో తప్పించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

The prisoner escaped from prison with an attack on the police in nizamabad
పోలీసులపై దాడి తుపాకీతో ఖైదీ పరార్​

By

Published : Apr 5, 2020, 9:43 AM IST

నిజామాబాద్ నగరంలోని గౌతమ్​నగర్​కు చెందిన ప్రసాద్​ను ఇటీవల దొంగతనం కేసులో మాక్లూర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితునికి కోర్టు రిమాండ్ విధించడం వల్ల సారంగాపూర్ జైలులో ఉంచారు. కాగా అతను నిన్న అనారోగ్యానికి గురవడం వల్ల నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

అయితే అతను రాత్రి 10.30 గంటల సమయంలో ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసి హాండ్​కప్స్ ఉండగానే తుపాకీతో పారిపోయాడు. సిబ్బంది సమాచారం మేరకు ఒకటో పట్టణ పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. పారిపోయిన ఖైదీ కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులపై దాడి తుపాకీతో ఖైదీ పరార్​

ఇదీ చూడండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్

ABOUT THE AUTHOR

...view details