తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపై వరి నాట్లతో వినూత్న నిరసన

వర్షం వస్తే చాలు రోడ్డుపై ప్రయాణించే పరిస్థితి లేదు.. రోడ్డు మొత్తం బురదతో చాలా ఇబ్బందిగా మారిందని నల్గొండ జిల్లా దుబ్బకాల్వ గ్రామస్థులు రోడ్డుపై వరి నాట్లు వేసి వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు.

By

Published : Aug 5, 2019, 7:33 PM IST

రోడ్డుపై వరి నాట్లతో వినూత్న నిరసన

నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని దుబ్బకాల్వ గ్రామస్థులు వినూత్నంగా తెలియజేశారు. తమ గ్రామానికి మునుగోడు నుంచి వచ్చే రోడ్డు ఇటీవల వర్షాలకు బురదతో చాలా ఇబ్బందిగా మారిందని రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. అయినా ఇప్పటి వరకు గ్రామానికి ఎటువంటి నిధులు రాలేదు. సర్పంచ్​కు చెక్ పవర్ లేకపోవడంతో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై వరి నాట్లతో వినూత్న నిరసన

ABOUT THE AUTHOR

...view details