తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్తి కోసం చంపేశారు... 6 నెలల తర్వాత అరెస్టయ్యారు

కన్న తండ్రి తన పేరు మీద ఆస్తి రాసివ్వట్లేదన్న కోపంతో... క్రూరంగా ఆలోచించాడు ఓ కొడుకు. భార్యతో కలిసి బతికుండగానే నిప్పంటించాడు. కాపాడుతున్నట్టు నటించాడు. చివరికి కటకటాలపాలయ్యారు.

By

Published : Oct 30, 2019, 10:32 PM IST

SON MURDERED FATHER FOR PROPERTY ARRESTED AFTER 6 MONTHS

ఆస్తి కోసం చంపారు... 6 నెలల తర్వాత అరెస్టయ్యారు...

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్ మండలం పొన్నాలలో మేలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బాలనర్సింహ అనే వృద్ధుడు మే 4న అగ్నిప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 6 న మరణించాడు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. తమకు ఆస్తి ఇవ్వటం లేదన్న కోపంతో కొడుకు నర్సింహ, కోడలు జాంగిరమ్మ ఓ పథకం పన్నారు.

భయపడి ఉన్నదంతా చెప్పుకున్నారు...

మే నాలుగో తేదీ రాత్రి సమయంలో బాలనర్సింహ ఇంటి బయట పడుకోగా... దంపతులిద్దరూ కూడబలుక్కొని వృద్ధునిపై కిరోసిన్​పోసి నిప్పంటించారు. బాలనర్సింహ కేకలు వేయగా... మంటలు ఆర్పుతున్నట్లు నటించి, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు 6న మరణించాడు. ఆస్పత్రిలో బాలనర్సింహ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 6 నెలలుగా సాగుతున్న విచారణకు భయపడిన నిందితులు గ్రామ పెద్దల వద్ద ఉన్నదంతా చెప్పుకున్నారు. కొడుకుకోడలే హత్య చేశారని నిర్ధరించుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం

ABOUT THE AUTHOR

...view details