తెలంగాణ

telangana

ETV Bharat / state

'16 సీట్లు గెలిపించి కేసీఆర్​కు బహుమతి ఇవ్వాలి'

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేష్​ను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు.

By

Published : Apr 8, 2019, 11:13 AM IST

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం : అరిగెల

ఆదిలాబాద్ ఎంపీగా నగేష్​ను గెలిపించాలి : అరిగెల

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు తెరాస కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ ఎంపీగా నగేష్​ను గెలిపించి కేసీఆర్​కు బహుమతిగా ఇవ్వాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తెరాసలోకి వస్తున్నారని స్పష్టం చేశారు . తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మీ, రెండు పడకల గదుల ఇళ్లు తదితర పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details