తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహితపై సామూహిక అత్యాచారం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బధ్య తండాలో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న ఓ మహిళను పత్తి చేలోకి తీసుకెళ్లి ఏడుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By

Published : Jan 26, 2020, 6:11 AM IST

gang rape in khammam district
వివాహితపై సామూహిక అత్యాచారం

ఇంటి వద్ద ఉన్న మహిళ(35)ను బలవంతంగా శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బధ్య తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన వివాహిత ఇంట్లో ఉండగా... శుక్రవారం రాత్రి హరియా తండాకు చెందిన ఏడుగురు యువకులు ఆమెను బలవంతంగా శివారు ప్రాంతంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకోవటంతో నిందితులు పరారయ్యారు.

పోలీసులకు సమాచారం అందించగా... బాధిత మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ పూజ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ బంధువులు, గ్రామస్థులు రఘునాథపాలెం పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన చేశారు.

వివాహితపై సామూహిక అత్యాచారం

ఇవీ చూడండి: ప్రేమోన్మాదం: స్నేహితురాలినే హతమార్చిన ఉన్మాది

ABOUT THE AUTHOR

...view details