కాంగ్రెస్ను గుక్కతిప్పుకోనివ్వద్దు...
కరీంనగర్ సభ ప్రతిష్టాత్మకం
ఈనెల 17న కరీంనగర్లో జరగనున్న తెరాస భారీ బహిరంగసభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. కేసీఆర్ ప్రసంగం దేశ ప్రజలకు దిశానిర్దేశం చేయనుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్లో తెరాస కార్పోరేటర్ల సభలో అన్నారు.
కరీంనగర్ సభ ప్రతిష్టాత్మకం
జనసమీకరణ కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్,ఎమ్మెల్యే గంగుల కమలాకర్,మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని చర్చించారు. గత శాసనసభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ పార్టీకి గుక్కతిప్పుకోనివ్వకుండా మెజార్టీ సాధించడంలో ప్రతి ఒక్కరు కీలకపాత్ర పోషించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ఇవీ చూడండి:సబితారెడ్డి కుమారుడికి కారులో సీటు..!