తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​ సభ ప్రతిష్టాత్మకం

ఈనెల 17న కరీంనగర్​లో జరగనున్న తెరాస భారీ బహిరంగసభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. కేసీఆర్​ ప్రసంగం దేశ ప్రజలకు దిశానిర్దేశం చేయనుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్​లో తెరాస కార్పోరేటర్ల సభలో అన్నారు.​

కరీంనగర్​ సభ ప్రతిష్టాత్మకం

By

Published : Mar 13, 2019, 11:09 PM IST

కరీంనగర్​ సభ ప్రతిష్టాత్మకం
కరీంనగర్‌లో నిర్వహించబోయే పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభ దేశప్రజలకు దిశానిర్దేశం చేయనుందని రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ఈనెల 17న జరగనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని కరీంనగర్​ నగరపాలక కార్పోరేటర్లకు ఆయన సూచించారు.

కాంగ్రెస్​ను గుక్కతిప్పుకోనివ్వద్దు...

జనసమీకరణ కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎంపీ వినోద్‌ కుమార్‌‌తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌,ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌,మేయర్ రవీందర్​ సింగ్ పాల్గొని చర్చించారు. గత శాసనసభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ పార్టీకి గుక్కతిప్పుకోనివ్వకుండా మెజార్టీ సాధించడంలో ప్రతి ఒక్కరు కీలకపాత్ర పోషించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.

ఇవీ చూడండి:సబితారెడ్డి కుమారుడికి కారులో సీటు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details