కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. లారీ కిందికి దూసుకెళ్లింది. ప్రమాదంలో రాజేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు రాకేశ్కు తీవ్ర గాయాలయ్యాయి.
హుస్నాబాద్కు చెందిన జన్నోజు రాజేందర్ అలియాస్ దత్తు(34) కరీంనగర్లో నివాసం ఉంటూ.. వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడైన మంద రాకేశ్తో కలిసి తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అలుగునూర్ కూడలి వద్ద ముందు వెళ్తున్న ఓ కారును అధిగమించే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. పక్కనే వెళుతున్న లారీ వెనుక చక్రాల కిందికి దూసుకుపోయింది.