తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2020, 8:43 AM IST

ETV Bharat / state

పుష్కరఘాట్​లో మహిళను కాపాడిన పోలీసులు

తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా నదీ స్నానం ఆచరించడానికి వచ్చిన ఓ మహిళ నీటిలో మునిగిపోతుండగా పోలీసులు కాపాడారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వేణిసోంపురంలో చోటుచేసుకుంది.

పుష్కరఘాట్​లో మహిళను కాపాడిన పోలీసులు
పుష్కరఘాట్​లో మహిళను కాపాడిన పోలీసులు

పుష్కరఘాట్​లో మహిళను కాపాడిన పోలీసులు

జోగులాంబ గద్వాల జిల్లా వేణిసోంపురం ఫుష్కరఘాట్​లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ మహిళను పోలీసులు కాపాడారు. గద్వాల పట్టణానికి చెందిన ఓ మహిళ తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ఐజ మండలంలోని వేణిసోంపురం పుష్కరఘాట్​కు వచ్చింది.

స్నానం కోసం ఘాట్​లోకి దిగింది. లోతు ఎక్కువగా ఉండటం వల్ల జారిపోయి నీళ్లలోకి పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు హుటాహుటిన నదిలోకి దూకి మహిళను కాపాడారు. ప్రమాదం తప్పడం వల్ల భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీచూడండి:ముగిసిన గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. మొదలైన తాయిలాల పర్వం

ABOUT THE AUTHOR

...view details