తెలంగాణ

telangana

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

By

Published : Aug 28, 2020, 8:22 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. నర్మెట్ట మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

kalyana lakshmi cheques distribution in narmetta mandal jangaon district
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు నిరుపేద కుటుంబాలకు వరంలా మారాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

సీఎం కేసీఆర్​... అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మా ప్రభుత్వం చేసే ఆభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: సీఎం

ABOUT THE AUTHOR

...view details