తెలంగాణ

telangana

ETV Bharat / state

సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత

భాజపాతో తెరాస కలుస్తుందని.. కాంగ్రెస్​ నేతలు సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని నిజామాబాద్​ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

By

Published : Apr 7, 2019, 12:09 AM IST

కవిత

తెరాస ప్రభుత్వంతో పాటు తన పని తీరును చూసి మళ్లీ పట్టం కట్టాలని నిజామాబాద్ పార్లమెంట్​ తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత కోరారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భాజపాతో తెరాస కలుస్తుందని కాంగ్రెస్​ నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోని 34 కోట్ల మంది మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం 4,300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణలో 70 లక్షల మంది కోసం రాష్ట్ర ప్రభుత్వం 2 వేల 4 కోట్ల బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు.

సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు: కవిత
ఇవీ చూడండి: '12 ఈవీఎంలతో పోలింగ్​ సజావుగా జరిగేనా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details