తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2023, 4:44 PM IST

ETV Bharat / state

TSRTC Palle Velugu Town Bus Pass : మరో గుడ్​న్యూస్​ చెప్పిన TSRTC.. ఇకపై 'పల్లె వెలుగు' బస్ పాస్

TSRTC Latest New Bus Pass Scheme : టీఎస్​ఆర్టీసీ.. ప్రయాణికులకు మరో తీపికబురు చెప్పింది. కొత్తగా 'పల్లె వెలుగు టౌన్​ బస్​ పాస్'కు శ్రీకారం చుట్టింది. తొలి దశలో నాలుగు జిల్లాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది.

TSRTC Palle Velugu Town Bus Pass
TSRTC Palle Velugu Town Bus Pass

TSRTC Pallevelugu Town Bus pass Details : ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్​పాస్​ విధానానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటగా కరీంనగర్, మహబూబ్​నగర్​, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్​లను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. వాటికి వచ్చే ఆదరణను బట్టి మిగతా జిల్లాల్లోనూ పల్లె వెలుగు టౌన్ బస్​పాస్​లను అమలు చేయాలని యాజమాన్యం ఆలోచన చేస్తుంది.

TSRTC Latest News :పల్లె వెలుగు టౌన్ బస్​పాస్​తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్​నగర్ నగరాల్లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండ నగరాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా పల్లె వెలుగు టౌన్ బస్​పాస్ ధరను ఆర్టీసీ సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్​లో జనరల్ బస్​పాస్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ బస్​పాస్​ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్​పాస్​ను సంస్థ తీసుకొచ్చింది.

త్వరలో మరిన్ని ప్రాంతాలకు..:హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఇవాళ పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. కొత్త టౌన్​పాస్​లు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు పల్లె వెలుగు టౌన్ బస్​పాస్​ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటిగా కరీంనగర్, మహబూబ్​నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్​ను అమలు చేస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్​ బస్​పాస్​ను విస్తరిస్తామన్నారు.

ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి..: గతంలో బస్సు ధరలను గమనిస్తే.. 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో బస్​పాస్​లకు సంస్థ రాయితీ కల్పించింది. ఇక నుంచి 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్​ విధానాన్ని హైదరాబాద్, వరంగల్​లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను మరింత ప్రోత్సహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ బస్​పాస్​కు సంబంధించిన పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

ఇవీ చదవండి..:

ABOUT THE AUTHOR

...view details