తెలంగాణ

telangana

ETV Bharat / state

గన్​పార్క్​ వద్ద తెరాస శ్రేణుల హోలీ సంబురాలు..

రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీల నేతలు కార్యకర్తలతో కలిసి రంగుల పండుగను ఉల్లాసంగా జరుపుకున్నారు. హైదరాబాద్​ గన్​పార్క్​ వద్ద తెరాస శ్రేణులు ఒకరికొకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

By

Published : Mar 21, 2019, 5:16 PM IST

తెరాస శ్రేణులు

హోలీ సంబురాల్లో తెరాస శ్రేణులు
హైదరాబాద్ గన్​పార్క్ వద్ద తెరాస శ్రేణులు హోలీ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ మమత సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

16 ఎంపీ స్థానాలు గెలవాలి

గన్​పార్క్​ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు గెలవాలని మమత గుప్తా ఆకాంక్షించారు. రాష్ట్ర ఆశయాలు సాధించాలంటే కేంద్రంలో తెరాస ఎంపీలు కీలకంగా ఉండాలన్నారు.

ఇవీ చూడండి :కేటీఆర్​ సమక్షంలో తెరాసలోకి నామ నాగేశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details