ఇప్పటివరకు ప్రధానవార్తలుఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తండ్రి మహబూబాబాద్ మం. గడ్డిగూడెం తండాలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపేశాడు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లక్షణాలు లేకుంటే పరీక్ష అవసరం లేదు Corona test guidelines: లక్షణాలు లేని వారు కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది.మరోసారి స్పందించిన ఆర్జీవీ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల ధర రూ.2,200 వరకు అనుమతించారు. ఏపీలో మాత్రం రూ.200కు అమ్ముకోవడానికి అనుమతుల్లేవు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఐనాక్స్ మల్టీప్లెక్స్లలో రూ.2,200 వరకు టికెట్లు విక్రయిస్తున్నారు’’ అని ఆర్జీవీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.కారులో వ్యక్తి మృతదేహం.. Dead Body Found in Car at Hanumakonda : హనుమకొండ చౌరస్తాలో కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. చౌరస్తాలోని బార్ వద్ద కారు నుంచి దుర్వాసన రావడం స్థానికులు గమనించారు. దగ్గరికి వెళ్లి చూడగా అందులో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పాలరాపుగుట్టపై కానరాని రాబందుల జాడ vultures at Palarapugutta : తెలంగాణలో రాబందులు అంతరించినట్టేనా? దక్షిణ భారతంలో రెండోది, రాష్ట్రంలో ఏకైక స్థావరమైన ఆసిఫాబాద్ జిల్లా పాలరాపుగుట్టపై కనుమరుగు అయ్యాయా? వీటిని ఇక జూపార్క్లోనే చూడాల్సి ఉంటుందా? క్షేత్రస్థాయి పరిస్థితులు వీటికి అవుననే సమాధానమిస్తున్నాయి.వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం koil alwar thirumanjanam at Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని తితిదే శుద్ధి చేస్తోంది. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు.నిజామాబాద్కు విజయవాడ పోలీసులు Nizamabad Family Suicide Case : ఏపీలోని విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడిన తెలంగాణ కుటుంబం కేసులో విచారణ చేపట్టేందుకు పోలీసులు ఇవాళ నిజామాబాద్కు రానున్నారు. వేధింపుల ఆరోపణలపై ఇప్పటికే నలుగురు వడ్డీ వ్యాపారులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిజామాబాద్కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్తో పాటు నిర్మల్కు చెందిన వినీత, చంద్రశేఖర్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.మతిస్థిమితంలేని బాలికపై గ్యాంగ్ రేప్ Sexual assault cases: మానసిక స్థితి సరిగాలేని బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. మరో కేసులో పాఠశాలకు వెళ్తున్న బాలికను అపహరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటనలు కర్ణాటకలో వెలుగు చూశాయి.ధోనీ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా Kohli about Dhoni advice: కెరీర్ ప్రారంభంలో ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపాడు టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. పంత్ విషయంలోనూ ఆ సలహా వర్తిస్తుందని చెప్పాడు.గాయని లతా మంగేష్కర్కు కరోనా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో రోజులు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా కరోనా బారినపడ్డారు. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు స్పల్ప లక్షణాలు ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.